Virat Kohli: కింగ్ కోహ్లి ఈరోజు ఆ రికార్డ్ బ్రేక్ చేస్తాడా? 

ప్రపంచకప్‌ 2023లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో కింగ్ కొహ్లీ 120 పరుగులు చేస్తే రికీపాంటింగ్ రికార్డ్ బ్రేక్ చేసి.. ప్రపంచ కప్ లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్ మెన్ గా చరిత్ర సృష్టిస్తాడు

New Update
Pubity 2023 Award : స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ ఖాతాలో మరో ఘనత

Virat Kohli: విరాట్ కోహ్లి తిరుగులేని క్రికెటర్. ఈ విషయాన్ని ప్రపంచ క్రికెట్ మొత్తం ఒప్పుకుంటుంది. భారీ రికార్డులన్నిట్నీ తన పేరు మీద ఇప్పటికే కట్టేసుకున్నాడు. అందులో కొన్ని ఎప్పటికీ చెరిగిపోనివి.. ఎవ్వరూ చెరపలేనివి కూడా ఉన్నాయి. ఈ వరల్డ్ కప్ లో అయితే.. కింగ్ కొహ్లీ బ్యాట్ పట్టుకోగానే ప్రత్యర్థి బౌలర్లలో వణుకు మొదలైపోతోంది. బ్లాస్టింగ్ బ్యాటింగ్ తో ఇటీవలే మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ వన్డే ఇంటర్నేషనల్స్‌లో 49 సెంచరీల రికార్డును సమం చేసి సంచలనమ్ సృష్టించాడు. ఇప్పుడు ఈ భారత రన్-మెషిన్ అతని విశిష్టమైన రికార్డుల వేటలో మరో వేటకు సిద్ధం అయిపోయాడు. 

ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కిన విరాట్(Virat Kohli), ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అధిగమించి ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచే ఛాన్స్ ఉంది. 

  • ప్రస్తుతం నాలుగో ప్రపంచకప్‌ను ఆడుతున్న విరాట్ నాలుగు సెంచరీలు, 11 అర్ధ సెంచరీలతో సహా నాలుగు ఎడిషన్లలో 58.00 సగటుతో 35 మ్యాచ్‌ల్లో 1624 పరుగులు చేశాడు.
  • పాంటింగ్ 46 మ్యాచ్‌ల్లో 45.86 సగటుతో 1743 పరుగులు చేశాడు. ఈ  ఆస్ట్రేలియా బ్యాటింగ్ దిగ్గజం ప్రస్తుతం ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులతో రెండో స్థానంలో ఉంది.
  • ప్రపంచకప్‌లో 45 మ్యాచ్‌లు ఆడిన టెండూల్కర్ 56.95 సగటుతో 2278 పరుగులతో అగ్రస్థానంలో ఉన్నాడు.
  • న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో విరాట్ 120 పరుగులు చేయగలిగితే, అతను పాంటింగ్ 1743 పరుగులను అధిగమించి, ప్రపంచ కప్ చరిత్రలో రెండవ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అవుతాడు.
  • విరాట్‌ ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తే అత్యధిక వన్డే సెంచరీలు చేసిన బ్యాట్స్‌మెన్‌గా నిలుస్తాడు. ఇప్పుడు 49 సెంచరీలతో టెండూల్కర్‌తో కలిసి అగ్రస్థానాన్ని పంచుకుంటున్నాడు కొహ్లీ. 

Also Read: భారత్-న్యూజీలాండ్ టీమ్స్ లో మ్యాచ్ ను మలుపు తిప్పగలిగే సత్తా వీరిదే! 

ప్రపంచ కప్‌లలో అత్యధిక పరుగుల వీరులు వీరే.. 

ప్లేయర్                             మ్యాచ్‌లు                      పరుగులు

సచిన్ టెండూల్కర్                45                              2278

రికీ పాంటింగ్                          46                              1743

విరాట్ కోహ్లీ                            35                               1624

కుమార్ సంగక్కర                   37                               1532

డేవిడ్ వార్నర్                         27                               1491

ఇక ఈ సెమీఫైనల్ మ్యాచ్ వివరాలకు వస్తే.. 2023 ప్రపంచకప్‌లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ మధ్య తొలి సెమీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా 8వ సారి, న్యూజిలాండ్ 9వ సారి సెమీఫైనల్ ఆడనుంది. టోర్నీలో ఇరు జట్లు వరుసగా రెండోసారి సెమీస్‌లో తలపడనున్నాయి.

భారత అభిమానులు జూలై 10, 2019 మాంచెస్టర్ 2019 నుంచి ముంబై 2023 వరకు గుర్తుంచుకుంటారు . నాలుగేళ్ల తర్వాత మరోసారి వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు సెమీఫైనల్‌లో తలపడనున్నాయి. ఈరోజు, ఇరు జట్లు మైదానంలోకి అడుగుపెట్టినప్పుడు, భారత అభిమానులకు ముందుగా గుర్తుకు వచ్చేది జూలై 10, 2019 తేదీ ఎందుకంటే, ప్రపంచ కప్ 2019 సెమీ-ఫైనల్‌లో అదే జట్టు చేతిలో ఓడిపోవడంతో టీమ్ ఇండియా టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.  2019లో, టీమ్ ఇండియా ప్రపంచ కప్ గెలవడానికి బలమైన పోటీదారుగా నిలిచింది. కానీ, సెమీ-ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌పై 18 పరుగుల తేడాతో ఓటమి కారణంగా, జట్టు ఇంటి బాట పట్టింది. ఇప్పుడు ప్రతి భారత క్రికెట్ అభిమాని కూడా అప్పటి ఓటమికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుని సగర్వంగా టీమిండియా ఫైనల్స్ చేరుకోవాలని కోరుకుంటున్నారు. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు