MLA Raghunandar Rao: ఇదేనా బంగారు తెలంగాణ అంటే..ఎమ్మెల్యే రఘునందర్ రావు ట్విట్టర్ వేదికగా సెటైర్లు!

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. ఇదేనా.. బంగారు తెలంగాణ అంటే అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ సొంత నియోజక వర్గంలోనే దళితులు రోడ్డెక్కారని ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

MLA Raghunandar Rao: ఇదేనా బంగారు తెలంగాణ అంటే..ఎమ్మెల్యే రఘునందర్ రావు ట్విట్టర్ వేదికగా సెటైర్లు!
New Update

MLA Raghunandar Rao: బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కేసీఆర్ సర్కార్ పై మండిపడ్డారు. ఇదేనా.. బంగారు తెలంగాణ అంటే అని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ సొంత నియోజక వర్గంలోనే దళితులు రోడ్డెక్కారని ఆయన ట్విట్టర్ వేదికగా విమర్శించారు.

దళితబంధు పథకంలో కూడా అన్యాయం జరిగిందని ప్రజలు ఆగ్రహంతో ఉన్నట్టు ఆయన తెలిపారు. ఇక దేవాదాయ ల్యాండ్ లో అక్రమ నిర్మాణాలు కడితే మంత్రి ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రజలే మండిపడుతున్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు పేర్కొన్నారు. తొమ్మిదేళ్లు గడిచినా డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇంకెప్పుడు ఇస్తారని ప్రజలు మంత్రి మల్లారెడ్డి పై తిరుగుబాటు చేశారని ఆయన పేర్కొన్నారు.

ప్రజలు.. నియోజకవర్గ సమస్యలు మీకు పట్టవా అంటూ ఎమ్మెల్యే, మంత్రులపై తిరుగుబాటుకు దిగుతున్నారని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం మాటలు చెప్పడం,ఇక ఓట్ల రాజకీయాలు చేయడం తప్ప పేద ప్రజల పట్ల చిత్తశుద్ధితో ఉండదా అని ఎమ్మెల్యే రఘునందన్ రావు ట్వీట్ ద్వారా నిలదీశారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి