తన ప్రభుత్వ అధికారాలను హరించడానికి ఉద్దేశించిన ఢిల్లీ వివాదాస్పద ఆర్డినెన్స్ పార్లమెంటులో వ్యతిరేకించాలని, ఈ విషయంలో తనకు మద్దతునివ్వాలని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నేతలను కలిసి అభ్యర్థించారు. మొదట దీనిపై కాంగ్రెస్ పార్టీ కొంత వెనుకంజ వేసినప్పటికీ, చివరకు ఆయనకు మద్దతునివ్వడానికే నిర్ణయించుకుంది. మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానానికి నోటీసులు కూడా ఇచ్చిన విపక్ష సభ్యులు.. ఢిల్లీ ఆర్డినెన్స్ పై కూడా సభలో సర్కార్ ని గట్టిగా నిలదీసే సూచనలు ఉన్నాయి. ది గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ కేపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ (అమెండ్మెంట్) బిల్లు పేరిట ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంటులో తెచ్చినప్పుడు ప్రతిపక్ష కూటమి దీనిపై బీజేపీ నేతృత్వం లోని ఎన్డీయేనిపై విరుచుకుపడే అవకాశాలున్నాయని సంబంధిత వర్గాలు తెలిపాయి.
పూర్తిగా చదవండి..ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై పార్లమెంటులో దుమారం తప్పదా ?
వివాదాస్పద ఢిల్లీ ఆర్డినెన్స్ పై బిల్లును కేంద్ర ప్రభుత్వం వచ్చే వారం లోక్ సభలో ప్రవేశ పెట్టే సూచనలున్నాయి. ఈ బిల్లుపై పార్లమెంటులో విపక్షాలు పెద్దఎత్తున రభసకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఢిల్లీ బ్యూరోక్రాట్ల బదిలీలు, పోస్టింగులకు సంబంధించిన ఈ ఆర్డినెన్స్ ను ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న సంగతి తెలిసిందే.
Translate this News: