ఇటివలే కాంగ్రెస్లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డికి గట్టి షాక్ తగిలింది. పొంగులేటి సోదరుడు ప్రసాద్రెడ్డిని భూకబ్జా ఆరోపణలు చుట్టుముట్టాయి. 21.50 గుంటల ప్రభుత్వ స్థలాన్ని ప్రసాద్రెడ్డి ఆక్రమించినట్టు అధికారులు చెబుతున్నారు. ఖమ్మం శివారులోని గోపాలపురంలో పొంగులేటి స్థలం దగ్గర అధికారుల సర్వే చేపట్టారు. NSP కెనాల్ భూముల ఆక్రమణపై అధికారుల సర్వే చేస్తుండగా పొంగులేటి అనుచరులు, కాంగ్రెస్ శ్రేణులు వాళ్లని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో అధికారులకు, పొంగులేటి అనుచురులకు మధ్య వాగ్వాదం జరిగింది. అయితే పోలీసులు సీన్లోకి ఎంట్రీ ఇవ్వడంతో అధికారులు సర్వే పూర్తి చేశారు. ఆక్రమిత స్థలం వరకు మార్కింగ్ చేశారు రెవెన్యూ అధికారులు. పొంగులేటి SR గార్డెన్స్ పరిధిలో 21.50 గుంటల భూమి ఆక్రమణకు గురైనట్లు నిర్థారణకు వచ్చారు. దీనిపై ఇప్పటికే పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డికి నోటీసులు కూడా జారి చేశారు.
పూర్తిగా చదవండి..Ponguleti: కాంగ్రెస్లో చేరిన 15రోజులకే పొంగులేటికి షాక్..భూకబ్జా ఆరోపణలతో టెన్షన్ టెన్షన్..!
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొదరుడు ప్రసాద్రెడ్డికి ఇరిగేషన్ అధికారులు నోటీసులు జారీ చేశారు.ఖమ్మం శివారులోని గోపాలపురంలో పొంగులేటి స్థలం దగ్గర అధికారుల సర్వే చేపట్టారు. పొంగులేటి SR గార్డెన్స్ పరిధిలో 21.50 గుంటల భూమి ఆక్రమణకు గురైనట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు.
Translate this News: