AP High Court: రెండు వారాల్లో స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలి: హైకోర్టు

గుంటూరు జిల్లా వీరంకినాయుడుపాలెంలో అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. డీకే పట్టా భూముల్లో మైనింగ్‌ ఎలా చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. రెండు వారాల్లో స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని గనులశాఖను ఆదేశించింది.

New Update
AP High Court: రెండు వారాల్లో స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలి: హైకోర్టు
AP High Court: గుంటూరు జిల్లా వీరంకినాయుడుపాలెంలో అక్రమ మైనింగ్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ఎం.ప్రభుదాస్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. రెండెకరాలకే అనుమతి తీసుకున్నారని.. కానీ, 60 ఎకరాలకు ఫెన్సింగ్‌ వేసి అక్రమ మైనింగ్‌ చేస్తున్నారని పిటిషనర్‌ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. డీకే పట్టా భూముల్లో మైనింగ్‌ ఎలా చేస్తారని ధర్మాసనం ప్రశ్నించింది. ఫిర్యాదులు వస్తున్నా ఎందుకు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.

Also Read: టీడీపీకి షాక్.. వైసీపీలో చేరిన మాజీ మంత్రి

రెండు వారాల్లో స్టేటస్‌ రిపోర్టు ఇవ్వాలని గనులశాఖను హైకోర్టు ఆదేశించింది. అయితే, రెండు వారాల సమయం సరిపోదని న్యాయవాది చెప్పడంతో.. ఏదైనా గ్రహానికి వెళ్లి రిపోర్టు తేవాలా అని కౌంటర్ వేసింది. మైనింగ్‌ శాఖ ఇచ్చే నివేదికలో తేడాలు ఉండొద్దని హెచ్చరించింది. అదే జరిగితే స్థానిక న్యాయాధికారితో విచారణ జరిపిస్తామని వార్నింగ్ ఇచ్చింది. అవసరమైతే గనుల శాఖ ముఖ్య కార్యదర్శి, జిల్లా అధికారిని కోర్టుకు పిలుస్తామని వెల్లడించింది. తప్పని తేలితే మాత్రం అధికారులు బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
ఈ నేపథ్యంలోనే విశాఖలోని రుషికొండపై అక్రమ తవ్వకాలు,గ్రావెల్‌ తరలింపుపై విచారణ జరిగింది. జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టింది. కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖకు నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికపై తీసుకునే నిర్ణయాన్ని కోర్టుకు సమర్పించేందుకు కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది 2 వారాల సమయం కోరారు. ఇప్పటికే పిటిషనర్ ఎన్జీటీకి వెళ్లగా డిస్మిస్ చేశారని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. వాదనలు విన్న న్యాయస్థానం తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేసింది.
Advertisment
తాజా కథనాలు