Adani Group: అదానీ గ్రూప్ సంచలనం.. భారీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌ షురూ..!

అడానీ గ్రూప్ భారత్‌లో అతిపెద్ద బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ (BESS) ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. 1,126 MW పవర్, 3,530 MWh స్టోరేజ్ సామర్థ్యంతో 700కి పైగా కంటైనర్లు అమర్చనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2026 మార్చి నాటికి పూర్తి కానుంది.

New Update
Adani Group

Adani Group

Adani Group: భారతీయ పరిశ్రమలో పెద్ద మార్పు చూపిస్తూ, అదానీ గ్రూప్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ (BESS) రంగంలో అడుగు పెట్టింది. అదానీ గ్రూప్ ఇటీవల 1,126 MW/3,530 MWh సామర్థ్యంతో ఒక అతి పెద్ద ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ 2026 మార్చి వరకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

India's Largest Battery Energy Storage

ఈ ప్రాజెక్ట్‌లో 700కి పైగా BESS కంటైనర్లు అమర్చనున్నారు. భారత్‌లో ఇదే అత్యంత పెద్ద BESS ఇన్స్టలేషన్ అవుతుంది. ప్రపంచంలో ఒకే ప్రదేశంలో ఈ స్థాయిలో పెద్ద బ్యాటరీ స్టోరేజ్ ప్రాజెక్ట్‌లు అరుదుగా మాత్రమే ఉంటాయి.

ఈ BESS ప్రాజెక్ట్ పవర్ సామర్థ్యం 1,126 MW, ఎనర్జీ స్టోరేజ్ సామర్థ్యం 3,530 MWh కలిగి ఉంటుంది. అంటే, 1,126 MW పవర్‌ను 3 గంటల పాటు నిల్వ చేయడం సాద్యమవుతుంది.

అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ మాట్లాడుతూ, “పునరుత్పత్తి శక్తితో నడిచే భవిష్యత్తుకు ఎనర్జీ స్టోరేజ్ మూలస్తంభం. ఈ ప్రాజెక్ట్ ద్వారా మేము కేవలం ప్రపంచ స్థాయి ప్రమాణాలను మాత్రమే సృష్టించడం కాదు, భారత్ ఎనర్జీ స్వాతంత్ర్యానికి, సుస్థిరతకు మా కట్టుబాటును కూడా సుస్థిరంగా చూపనున్నాము. ఈ ప్రయత్నం నమ్మకమైన విద్యుత్ సరఫరా చేయడంలో కీలకంగా ఉంటుంది” అన్నారు.

ఈ ప్రాజెక్ట్ ద్వారా అదానీ గ్రూప్ ప్రపంచ స్థాయి ఎనర్జీ లీడర్స్ సరసన నిలబడింది. ఇది భారత్‌లో శుభ్రమైన, అతి పెద్ద నిల్వ సౌకర్యాల ఏర్పాటు విషయంలో ఒక మైలురాయి. దీని ద్వారా దేశంలో 24 గంటలు శుభ్రమైన విద్యుత్ అందించడం, తక్కువ కార్బన్ ఉత్పత్తితో విద్యుత్ వ్యవస్థను ప్రోత్సహించడం సులభం అవుతుంది.

BESS సిస్టమ్ పీక్ లోడ్ నిదానానికి, ట్రాన్స్మిషన్ లోడ్ తగ్గించడానికి, సౌరశక్తి వినియోగంలో అధిక సామర్థ్యం సాధించడానికి, గ్రిడ్ నమ్మకాన్ని పెంచడానికి ముఖ్య పాత్ర వహిస్తుంది.

ప్రాజెక్ట్ ఖావ్డా ప్రాంతంలో, ప్రపంచంలో అతిపెద్ద పునరుత్పత్తి శక్తి కేంద్రంలో ప్రారంభం కానుంది. ఇది ఆధునిక లిథియం-ఐయాన్ బ్యాటరీ సాంకేతికతతో, అత్యుత్తమ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిస్టమ్‌లతో రూపొందనుంది. తద్వారా మెరుగైన పనితీరు, విశ్వసనీయత పొందడం సులభం అవుతుంది.

అదానీ గ్రూప్ 2027 మార్చి వరకు అదనంగా 15 GWh BESS సామర్థ్యాన్ని ఏర్పాటు చేయాలని, వచ్చే 5 సంవత్సరాల్లో మొత్తం 50 GWh సామర్థ్యం సాధించాలని చూస్తోంది.

ఈ ప్రాజెక్ట్ ద్వారా విద్యుత్ రంగం సమర్ధవంతమైన విద్యుత్ వినియోగంలో, శక్తి భద్రత పెంపులో కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయని కంపెనీ చెబుతోంది.

Advertisment
తాజా కథనాలు