ప్రధాని మోదీ కోసం ప్యారిస్లో ప్రైవేట్ డిన్నర్ ఏర్పాటు చేసిన మేక్రాన్…మోదీకి ఈ అత్యున్నత పురస్కారాన్ని బహుకరించారు. ఫ్రెంచ్ పురస్కారాల్లో లేదా మిలటరీ అవార్డులలో ఇదే అత్యున్నత పురస్కారం. అయితే ఇలాంటి పురస్కారం భారత ప్రధానికి దక్కడం ఇదే తొలిసారి కావడం విశేషం. గురువారం రాత్రి ప్రధాని మోదీ.. ఫ్రాన్స్లో స్థిరపడిన ప్రవాస భారతీయలతో భేటీ అయ్యారు. చంద్రయాన్ 3 ప్రయోగంతో పాటు అనేక విషయాలను వారితో ప్రధాని చర్చించారు. చంద్రయాన్ 3 ప్రయోగానికి కౌంటింగ్ మొదలైందని.. శ్రీహరి కోట నుంచి రాకెట్ ప్రయోగించబోతున్నట్లు తెలిపారు.
పూర్తిగా చదవండి..ఇకపై ఫ్రాన్స్లోనూ యూపీఐ డిజిటల్ సేవలు, మోదీకి అత్యున్నత పురస్కారం!
భారత ప్రధాని మోదీ రెండురోజుల పర్యటన నిమిత్తం ఫ్రాన్స్కు వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే గురువారం ప్యారిస్లో ల్యాండ్ అయిన ప్రధానికి అరుదైన గౌరవం లభించింది. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోర్నే స్వయంగా విమానశ్రయానికి వచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అక్కడే ప్రధాని సైనిక గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఆ దేశ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ ప్రధాని మోదీని ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్’పురస్కారంతో సత్కరించారు.
Translate this News: