అమెరికన్ల కంటే భారతీయులే మేలు..అమెరికా రాయబారి!

భారత్‌లో ప్రజాస్వామ్యంపై ఉన్న ఆందోళనలను అవసరం లేదని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. అమెరికన్ల కంటే భారతీయులు చాలా రకాలుగా మెరుగ్గా ఉన్నారని కూడా ఆయన అన్నారు.ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

అమెరికన్ల కంటే భారతీయులే మేలు..అమెరికా రాయబారి!
New Update

భారత్‌లో ప్రజాస్వామ్యంపై ఉన్న ఆందోళనలను అవసరం లేదని అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి తెలిపారు. అమెరికన్ల కంటే భారతీయులు చాలా రకాలుగా మెరుగ్గా ఉన్నారని కూడా ఆయన అన్నారు.ఢిల్లీలో విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎరిక్ గార్సెట్టి మాట్లాడుతూ, పదేళ్లలో భారతదేశం స్వేచ్ఛా, నిష్పక్షపాత ఎన్నికల ఆధారంగా శక్తివంతమైన ప్రజాస్వామ్యం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారతదేశంలో ప్రజాస్వామ్య పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఒక ప్రశ్నకు సమాధానమిస్తూ, అలాంటి ఆందోళన అవసరం లేదని అన్నారు. ముఖ్యంగా భారత్‌లో ఎన్నికల నిర్వహణ తీరును ఎత్తిచూపుతూ.. ప్రజాస్వామ్యం పెరుగుతున్నదనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. కొండ ప్రాంతంలో ఓ వ్యక్తి ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం చేసిన ఏర్పాట్లను, ప్రత్యక్షంగా చూసానని ఆయన ప్రస్తావించారు.

ఓటు వేయడానికి భారత ప్రజలు చూపుతున్న ఉత్సాహాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయానని అన్నారు. ఓట్ల కోసం డబ్బు చెల్లించకుండా నిరోధించడానికి వాహనాలను తనిఖీ చేస్తున్న వ్యక్తుల నివేదికలను తాను చూశానని ఎరిక్ గార్సెట్టి పేర్కొన్నాడు. అమెరికన్ల కంటే భారతీయులు చాలా రకాలుగా మెరుగ్గా ఉన్నారని గర్వంగా చెప్పారు.

ప్రజాస్వామ్య విలువలకు మద్దతివ్వడమే అమెరికా లక్ష్యమని, భారత్‌-అమెరికా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని అన్నారు. భారత్-అమెరికా సంబంధాలు 21వ శతాబ్దాన్ని నిర్వచించే బంధంగా ఉంటాయని ఆయన నొక్కి చెప్పారు. భారత్‌తో సంబంధాలపై అమెరికాకు 100 శాతం విశ్వాసం ఉందని కూడా ఆయన అన్నారు. భారతదేశంలో పార్లమెంటరీ ఎన్నికలు జరుగుతున్నందున, ఎన్నికల నిర్వహణ తీరుపై విదేశీ జోక్యంపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రజాస్వామ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎరిక్ గార్సెట్టి అన్నారు.

#americans #indians
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe