అప్పటివరకు జాబ్ చేస్తూ కుటుంబాన్ని పెంచి పోషిస్తున్న సూర్య అనే మహిళ యాక్సిడెంట్తో ఉద్యోగాన్ని కోల్పోయింది. చెన్నైకి చెందిన సూర్య 2020ఫిబ్రవరీలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆ తర్వాత నెల రోజులకే కరోనా లాక్డౌన్ విధించడంతో ఆమె కుటుంబానికి తిండి కూడా కరవైంది. ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితి.. బతకడం కోసం తన కుటుంబాన్ని బతికించడం కోసం తెలిసిన వాళ్ల దగ్గర అప్పులు చేస్తూ వచ్చింది. అలా ఆ అప్పుల సంఖ్య 5లక్షలు దాటింది. తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వమని ఒత్తిడి చేసేవాళ్లు పెరిగిపోయారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక పోయిన సూర్య తన కిడ్నీ అమ్మేందుకు నిర్ణయించుకుంది. నిజానికి ఇండియాలో కిడ్నీ అమ్మడం, కొనడం నేరం..అయితే గత్యంతరం లేక అదే చేయాలని డిసైడ్ అయ్యింది. మరి తర్వాత ఏం జరిగింది.. సుర్యా కిడ్నీ అమ్మిందా..? మోసపోయిందా..?
పూర్తిగా చదవండి..Fraudsters: కోటి రూపాయలు ఇస్తామన్నారు.. ఫేస్బుక్ అడ్డాగా పెరిగిపోతున్న కిడ్నీ రాకెట్ బాధితులు..!
చెన్నైలోని సూర్య అనే మహిళకు కిడ్నీ అమ్మితే కోటి రూపాయలు ఇస్తామని ఓ ఫేక్ డాక్టర్ కాల్ చేశాడు. పెరిగిపోయిన అప్పులు కట్టడానికి కిడ్నీ అమ్మేందుకు నిర్ణయించుకున్న సూర్య అతని మాటలు మొదట నమ్మంది. తర్వాత డోనార్ కార్డ్కి రూ.5లక్షలు కట్టమనడంతో అనుమానం వచ్చిన సూర్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Translate this News: