Indian Railways Rules : భారతదేశం(India) లో ఎక్కువ శాతం ప్రజా రవాణా జరిగేది రైల్వే(Indian Railway) వ్యవస్థ ద్వారానే అని చెప్పొచ్చు. సుదూర ప్రయాణాలు సాగించే ప్రజలు.. రైళ్లలో జర్నీకి ఆసక్తి చూపుతారు. ట్రైన్ టికెట్ ధర తక్కువగా ఉండటం, వేగవంతంగా గమ్యం చేరుకోవడం, ప్రయాణం కూడా సౌకర్యవంతంగా ఉండటంతో ఎక్కువగా జనాలు ట్రైన్ జర్నీకి ప్రాధాన్యత ఇస్తారు. అందులోనూ లగేజ్ తీసుకెళ్లడానికి కూడా వీలుగా ఉంటుంది. అయితే, లగేజీ విషయంలో రైల్వే చట్టం ప్రకారం కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి. మాదక ద్రవ్యాలు, మద్యం రవాణాకు రైల్వే నిబంధనలు అంగీకరించవు. అంతేకాదు.. మద్యం సేవించిగానీ.. ఇతర మత్తు పదర్థాలు తీసుకుని గానీ రైల్వే ప్రయాణించడానికి అనుమతి లేదు. ఒకవైళ ఎవరైనా మద్యం మత్తులో ట్రైన్ ప్రయాణం చేసినా.. ట్రైన్లో మద్యం బాటిళ్లను తీసుకెళ్లినా.. రైల్వే చట్టం ప్రకారం శిక్షార్హులు అవుతారు. రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 165 ప్రకారం.. మద్యం, నిషేధిత వస్తువులు అక్రమ రవాణా చేస్తే జైలు శిక్షతో పాటు, భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. ఇక సెక్షన్ 145 ప్రకారం.. రైల్వే ప్రాంగణంలో గానీ.. ట్రైన్లో గానీ.. ఎవరైనా మద్యం, మత్తు పదార్థాలు సేవిస్తే సదరు వ్యక్తులను అరెస్ట్ చేస్తారు. దాంతోపాటు జరిమానా కూడా విధిస్తారు.
పూర్తిగా చదవండి..Railway Rules : ట్రైన్లో మద్యం బాటిళ్లు తీసుకెళ్తున్నారా? ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
ట్రైన్ జర్నీ చేస్తున్నారా? మీ వెంట మద్యం, మత్తు పదార్థాలు, పేలుడు పదార్థాలు, రసాయనాలు, గ్యాస్ సిలిండర్లు సహా కొన్ని వస్తువులు తీసుకెళ్లడం నిషిద్ధం. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘించి తీసుకెళ్తే.. భారీ జరిమానాతో పాటు జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది.
Translate this News: