కజకిస్థాన్ లో చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ!

భారత్‌-చైనా మధ్య విబేధాలు కొనసాగుతున్నవేళ భారత విదేశాంగ మంత్రి జైశంకర్ చైనా మంత్రి వాంగ్ యీని కజకిస్థాన్‌లో భేటీ అయ్యారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 24వ శిఖరాగ్ర సదస్సు కజకిస్థాన్ లోని అస్తానాలో ప్రారంభమైంది. ఈ సదస్సులో వారిద్దరు కరచాలనం చేసుకోవటంతో ఆసక్తి నెలకొంది.

కజకిస్థాన్ లో చైనా విదేశాంగ మంత్రితో జైశంకర్ భేటీ!
New Update

షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ 24వ శిఖరాగ్ర సమావేశం నిన్న కజకిస్థాన్ లోని అస్తానాలో ప్రారంభమైంది. ఈ సదస్సులో  కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ పాల్గొన్నారు. ఆ సదస్సులోనే పాల్గొన్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీని తో జైశంకర్ సమావేశమైయారు.

భారత్, చైనాల మధ్య సరిహద్దు వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఇరుదేశాల నేతలు సమావేశమవటంతో ఆసక్తి నెలకొంది.ఆ తర్వాత ఇద్దరు కలసి ఫోటో దిగి కరచాలనం చేసుకున్నారు. ఆ సమయంలో సరిహద్దు సమస్యల పరిష్కారంపై ఇరుదేశాల నేతలు కాసేపు చర్చించినట్లు తెలుస్తోంది.

#jaishankar
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి