/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-03T181822.031-jpg.webp)
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) తాజాగా మూడు ఫార్మాట్ల టీమ్ ర్యాంకింగ్స్ రిలీజ్ చేసింది. తాజా ర్యాంకింగ్స్లో టెస్టుల్లో 124 రేటింగ్స్తో ఆస్ట్రేలియా అగ్రస్థానంలో ఉండగా, వన్డే (122 రేటింగ్స్), టీ20 (264 రేటింగ్స్) ఫార్మాట్లలో భారత్ టాప్ పొజిషన్లో కొనసాగుతోంది. కాగా, టెస్టుల్లో భారత్ 120 రేటింగ్స్తో రెండో స్థానంలో ఉంది.అయితే 2021 మే తర్వాత ఆయా టీమ్ల ప్రదర్శనల ఆధారంగా ఈ ర్యాంకులు దక్కాయి. దాదాపు రెండేళ్ల కాలంలో ఆయా జట్ల విజయాలు, పెర్ఫార్మెన్స్లు పరిగణలోకి తీసుకున్నట్లు ఐసీసీ తెలిపింది. ఈ క్రమంలో గతేడాది జరిగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్ను ఢీకొట్టిన ఆస్ట్రేలియా 209 పరుగుల తేడాతో నెగ్గడం వల్ల టెస్టుల్లో ఆగ్రస్థానానికి చేరుకుంది.
Australia on 🔝
Reigning World Test Championship winners overtake India to claim the No.1 position on the ICC Men’s Test Team Rankings after the annual update.https://t.co/rl0Ju11fNu
— ICC (@ICC) May 3, 2024
2023-25 డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్లో మాత్రం టీమ్ఇండియానే అగ్రస్థానంలో ఉంది. 2023- 25 సైకిల్లో 9 మ్యాచ్లు ఆడిన టీమ్ఇండియా ఆరింట్లో నెగ్గి, 2 ఓడి, 1 డ్రా చేసుకుంది. ఈ క్రమంలో 68.51 పాయింట్ పర్సెంటేజీతో టాప్ ప్లేస్లో కొనసాగుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా 62.50 పాయింట్ పర్సెంటేజీతో రెండో స్థానంలో కొనసాగుతోంది.