వరంగల్ జిల్లాలో ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళీ అమ్మవారిని భారత ప్రధాని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి 6 రకాల ప్రసాదాలను ప్రధాని మోదీ నైవేద్యంగా సమర్పించారు. ఇందులో పులిహోర, చక్ర పొంగలి, రవ్వకేసరి, దద్దోజనం, రవ్వలడ్డు, బెల్లం లడ్డులు ఇలా 6 రకాల ప్రసాదాలను అమ్మవారికి సమర్పించారు. పూజలు చేసిన అనంతరం పండితుల నుంచి ఆశీర్వచనాలను అందుకున్నారు. ప్రధాని మోదీ పదిన్నర నుంచి 10.45 వరకు అంటే 15 నిమిషాల పాటు భద్రకాళీ అమ్మవారి సేవలో తరించారు. ప్రధాని మోదీ వరంగల్ జిల్లా పర్యటన భారీ ఎత్తున జరుగుతుంది.
పూర్తిగా చదవండి..భద్రకాళి అమ్మవారికి నైవేద్యంగా 6 రకాల ప్రసాదాలను సమర్పించిన మోదీ
ప్రధాని మోదీ శనివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. వారణాసి నుంచి నేరుగా హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ.. అక్కడి నుంచి నేరుగా వరంగల్ జిల్లాలోని ప్రసిద్దిగాంచిన శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రధాని మోదీకి భద్రకాళీ అమ్మవారంటే ఎంతో భక్తి. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Translate this News: