కోవిడ్ లాక్డౌన్ సమయంలో యూపీకి చెందిన సచిన్ మీనా , పాకిస్థాన్ సింధు ప్రావిన్సుల్లోని ఖైరాపూర్ జిల్లాకు చెందిన సీమా హైదర్లకు పబ్జీలో పరిచయం ఏర్పడింది. క్రమంగా ఈ పరిచయం స్నేహంగా మారి.. ఇద్దరూ ప్రేమలో పడ్డారు. అయితే, సీమాకు అప్పటికే వివాహమై నలుగురు పిల్లలు ఉన్నారు. కానీ, ప్రియుడి కోసం ఆమె ఈ ఏడాది మార్చిలో కరాచీ నుంచి బయలుదేరి దుబాయ్ మీదుగా నేపాల్కు చేరుకుంది. సచిన్, సీమా మొదటిసారి ప్రత్యక్షంగా నేపాల్లోనే కలుసుకున్నారు. అక్కడే పెళ్లి కూడా చేసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి ఇరువురూ తమతమ దేశాలకు తిరిగి వచ్చేశారు. అయితే, ఆ రోజు తన ప్రయాణం చాలా కఠినంగా సాగిందని, ఎంతో భయపడ్డానని సీమా గుర్తుచేసుకుంది. అనంతరం.. తన పిల్లలతోసహా భారత్ రావడానికి ఆమె పెద్ద కసరత్తే చేసినట్లు తెలుస్తోంది. నేపాల్ నుంచి పాకిస్థాన్ వెళ్లిన తర్వాత తన భర్తతో విభేదించి, తన పేరున ఉన్న ఓ ప్లాట్ను రూ.12 లక్షలకు అమ్మి డబ్బు సమకూర్చుకుంది. తనతో పాటు తన నలుగురు పిల్లలకు విమాన టిక్కెట్లు, నేపాల్ వీసా ఏర్పాటు చేసుకుంది.
పూర్తిగా చదవండి..పబ్జీ గేమ్ లవ్స్టోరీ, ఆఖరికి ప్రియుడి కోసం ఇల్లు అమ్మి..?
పబ్జీ గేమ్లో యూపీ యువకుడితో పాక్ మహిళకు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమకు దారితీసింది. అతడి కోసం పాక్ నుంచి నలుగురు పిల్లలతో కలిసి ఈ ఏడాది మే నెలలో ఆమె ఇండియాకు వచ్చేసింది. ఆమెను జులై 4న పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ మహిళతో సహా యువకుడు సచిన్, అతడి తండ్రిని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. కానీ, వారు ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.‘పబ్జీ’ప్రేమ కథలో అనేక ఆనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఇద్దరు ఇప్పటికే పెళ్లి చేసుకున్నట్లు తాజాగా వెల్లడయ్యింది. తనను తాను భారతీయురాలిగానే భావిస్తున్నానని, ఇక్కడే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తానని ఆమె చెప్పడం గమనార్హం.
Translate this News: