రేపు భారత్,జింబాబ్వే మధ్య 4వ T20 మ్యాచ్!

భారత్,జింబాబ్వే 4 టీ20 మ్యాచ్ రేపు సాయంత్రం 4.30 గంటలకు జింబాబ్వేలోని హరేరా వేదికగా ప్రారంభంకానుంది.ఇప్పటికే భారత్ 2-1తో సిరీస్ ముందంజలో ఉంది. రేపు జరిగే 4వ టీ20 లో భారత్ మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది.

రేపు భారత్,జింబాబ్వే మధ్య 4వ T20 మ్యాచ్!
New Update

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ కోసం భారత జట్టు జింబాబ్వేలో పర్యటిస్తోంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు మూడు మ్యాచ్‌లు జరిగాయి.  భారత జట్టు 2-1తో ఆధిక్యంలో నిలిచింది. త్వరలో జరగనున్న నాలుగో టీ20లో విజయం సాధిస్తే భారత్ సిరీస్ కైవసం చేసుకుంటుంది.ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో గెలిచి భారత జట్టుకు షాకిచ్చింది. తర్వాతి మ్యాచ్‌లో భారత జట్టు 100 పరుగుల తేడాతో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. ఆ తర్వాత మూడో మ్యాచ్‌లో భారత జట్టు 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ దశలో నాలుగో మ్యాచ్ జరగనుంది.

ఈ స్థితిలో రేపు నాలుగో మ్యాచ్ సాయంత్రం 4:30 గంటలకు జింబాబ్వేలోని హరారే స్టేడియంలో ప్రారంభంకానుంది.ఈ సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు అక్కడే జరగడం గమనార్హం. భారత్ vs జింబాబ్వే 5వ T20I ఆదివారం జరగనుంది. మ్యాచ్ కూడా సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇండియా vs జింబాబ్వే T20 మ్యాచ్‌లను సోనీ స్పోర్ట్స్ టెన్ గ్రూప్ ఛానెల్‌లలో చూడవచ్చు. ఇండియా-జింబాబ్వే మ్యాచ్‌లను మొబైల్, వెబ్‌లో చూడాలనుకునే వారు Sony Liv మొబైల్ యాప్ లేదా Sony Liv వెబ్‌సైట్‌లో మ్యాచ్‌లను వీక్షించవచ్చు. సోనీ లైవ్ సబ్‌స్క్రైబర్‌లు మాత్రమే ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా చూడగలరు.

#4th-t20 #india-vs-zimbabwe
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe