Ind vs Aus: దుమ్మురేపిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ లక్ష్యం 353 పరుగులు

Ind vs Aus: దుమ్మురేపిన ఆసీస్ బ్యాటర్లు.. భారత్ లక్ష్యం 353 పరుగులు
New Update

Ind vs Aus: రాజ్‌కోట్ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో ఆస్ట్రేలియా బ్యాటర్లు అదరగొట్టారు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కంగారు జట్టు తొలి బంతి నుంచే దూకుడుగా ఆడటం ప్రారంభించారు. ఓపెనర్ డేవిడ్ వార్నర్ 34 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేసి ఔటయ్యాడు. అనంతరం మిచెల్ మార్ష్ 84 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్సర్లతో 96 పరుగులు చేయగా.. స్టీవ్ స్మిత్ 74 పరుగులతో రాణించాడు. ఇక మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ లబుషేన్ ఓ వైపు వికెట్లు ప‌డుతున్నప్పటికీ 72 పరుగులతో చివర్లో దుమ్మురేపాడు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్ల తీయగా.. కుల్దీప్ యాద‌వ్‌ రెండు, ప్రసిద్ద్ కృష్ణ, మ‌హ్మద్ సిరాజ్‌లు చెరో వికెట్ తీశారు.

భారత తుది జ‌ట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ

ఆస్ట్రేలియా తుది జ‌ట్టు: మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుస్చాగ్నే, అలెక్స్ కారీ(వికెట్ కీప‌ర్‌), గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, తన్వీర్ సంఘా, జోష్ హేజిల్‌వుడ్

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా ఇప్పటికే తొలి రెండు వన్డేలు గెలిచిన ఇండియా.. సిరీస్ సొంతం చేసుకుంది. మొదటి రెండు మ్యాచులకు దూరంగా ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచులో జట్టులోకి వచ్చారు.  ఇక రెండు మ్యాచుల్లో అద‌ర‌గొట్టిన సీనియర్ ప్లేయర్ రవిచంద్రన్ అశ్విన్‌ను ప‌క్క‌న బెట్టి అత‌డి స్థానంలో వాషింగ్ట‌న్ సుంద‌ర్‌కు చోటు ఇచ్చారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి