దేశంలో ఎండలు మండిపోతున్నాయి. ప్రధానంగా యూపీలో ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ఉదయం 9గంటలకే సూర్యుడు భగభగ మండిపోతున్నాడు. దీనికి తోడు వడగాల్పులు, దీంతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారింది. పాఠశాలల సెలవులు పొడిగించాలని రాష్ట్రప్రభుత్వాలను కోరే పరిస్థితి నెలకొంది. అలాంటి పరిస్థితిలో తాజాగా భారత వాతావరణ శాఖ కొన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. రానున్న కొద్ది రోజుల పాటు కొన్ని రాష్ట్రాల్లో తీవ్రమైన వేడి ఉంటుందని తెలిపింది.
పూర్తిగా చదవండి..దంచికొడుతున్న ఎండలు, దేశమంతటా వడగాల్పుల హోరు..తెలుగు రాష్ట్రాల్లోనూ భానుడి భగభగ..!!
ఎండలు దంచికొడుతున్నాయి. ఇప్పట్లో ఈ ఎండలు తగ్గేలా కనిపించడం లేదు. వాతావావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం వడగాల్పుల నుంచి ఉపశమనం లభించే పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. దేశంలోని పది రాష్ట్రాల్లో తీవ్రమైన వేడిగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రతలు ఇంకా పెరుగుతాయని ఐఎండీ తెలిపింది.
Translate this News: