ఈ ముగ్గురు పైనే భారత్ క్రికెట్ అభిమానుల చూపంతా!

పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో భారత్ గెలవాలంటే ఈ ముగ్గురు ప్లేయర్లు చెలరేగి ఆడాల్సి ఉంది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా ఆడితే మ్యాచ్ మనసొంతం అవుతుంది. అయితే ఈ మ్యాచ్ పాకిస్థాన్ కు డూర్ డై గా మారనుంది.పాక్ ఓడితే ఇంటికీ వెళ్లే పరిస్థితి నెలకొంది.

ఈ ముగ్గురు పైనే భారత్ క్రికెట్ అభిమానుల చూపంతా!
New Update

నేడు టీ20 వరల్డ్ కప్ లో చిరకాల ప్రత్యర్థి.. దాయాది దేశం అయిన పాకిస్తాన్ (Pakistan)తో తాడోపేడో తేల్చుకోనుంది.ఇరు జట్ల మధ్య న్యూయార్క్ వేదికగా ఆదివారం సాయంత్రం మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్ వర్క్ తో పాటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది.

ఇరు జట్లు కూడా ఇప్పటికే ఒక్కో మ్యాచ్ ఆడేసి ఉన్నాయి. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ విజయం సాధించింది. అయితే అమెరికా చేతిలో పాకిస్తాన్ ఓడి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.ప్రస్తుతం ఇరు జట్ల ఫామ్ ను చూస్తే పాకిస్తాన్ కంటే భారత్ పటిష్టంగా కనిపిస్తుంది. అమెరికా చేతిలో ఓడిన పాకిస్తాన్ కాస్త డీలా పడి ఉంది. అయితే ఆ జట్టును తక్కువ అంచనా వేయడానికి కూడా వీలు లేదు.

2022 T20 ప్రపంచకప్ లో కూడా పాకిస్తాన్ ను జింబాబ్వే ఓడిస్తుంది. అనంతరం బౌన్స్ బ్యాక్ అయ్యి ఫైనల్ వరకు చేరుకుంటుంది. ఇక న్యూయార్క్ పిచ్ పేసర్లకు అనుకూలించే అవకాశం ఉండటంతో పాక్ బౌలర్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది.పాకిస్తాన్ తో జరిగే మ్యాచ్ లో భారత్ గెలవాలంటే ముగ్గురు ప్లేయర్లు చెలరేగాల్సి ఉంది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా చెలరేగితే టీమిండియా విజయాన్ని ఆపడటం ఎవరి తరం కాదు.

ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ విఫలం అయిన సంగతి తెలిసిందే. అయితే పాకిస్తాన్ పై రెచ్చిపోవాలనే పట్టుదలతో కోహ్లీ ఉన్నాడు. టి20 ప్రపంచకప్ లో పాకిస్తాన్ పై కోహ్లీకి అద్భుతమైన రికార్డు ఉంది. కేవలం 4 మ్యాచ్ ల్లోనే 308 పరుగులు చేశాడు.భారత్ తో జరిగే మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడితే మాత్రం సూపర్ 8 అవకాశాలు మూసుకుపోయే అవకాశం ఉంది.

#t20-world-cup-2024 #ind-vs-pak
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి