Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) కు అరుదైన గౌరవం దక్కనుంది. లండన్ లోని ప్రఖ్యాత ‘మేడం తుస్సాడ్స్’ మ్యూజియంలో మైనపు బొమ్మ రూపంలో అల్లు అర్జున్ అతి త్వరలో కనిపించనున్నాడని టాక్ వినిపిస్తోంది. అక్కడే అల్జు అర్జున్ మైనపు విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారన్నది తాజా సమాచారం. ఇందుకు సంబంధించిన సన్నాహకాలు మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
అల్జు అర్జున్ త్వరలోనే లండన్ మ్యూజియాన్ని సందర్శించడంతోపాటు, మైనపు విగ్రహం రూపొందించడానికి కావాల్సిన తన శరీర కొలతలను ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. దక్షిణాది నుంచి ఇప్పటికే ప్రభాస్, మహేశ్ బాబు మైనపు విగ్రహాలను లండన్ మ్యూజియంలో ఏర్పాటు చేయగా, ఇప్పుడు అల్లు అర్జున్ వారి సరసన చేరిపోనున్నాడు. ఎంతో మంది ప్రముఖుల మైనపు బొమ్మలు లండన్ మ్యూజియంలో కొలువై ఉన్నాయి.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి తెలుగు ఇండస్ట్రీలో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. చైల్డ్ ఆర్టిస్ట్గా తెరంగేట్రం చేసిన ఈ స్టార్ హీరో.. ‘గంగోత్రి’ సినిమాతో హీరోగా స్క్రీన్పై కనిపించారు. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి తనకెదురైన ప్రతి సవాల్ను స్వీకరించి ఓ మంచి నటుడిగా తనని తాను నిరూపించుకున్నాడు.
‘పుష్ప ది రైజ్’ సినిమాలో పుష్ప రాజ్గా ఆయన నటన మాటల్లో చెప్పలేనిది. అప్పటి వరకు బన్నీ స్టార్డం ఒక్క ఎత్తు అయితే.. పుష్ప తర్వాత తన రేంజ్ మరో ఎత్తు. ఈ సినిమాతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన బన్నీ.. ఎన్నో అవార్డులను అందుకుని సత్తా చాటారు. రిసెంట్ గా జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా కూడా ఎంపికయ్యారు. ఈ క్రమంలో జాతీయ చలన చిత్ర అవార్డుల చరిత్రలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు.
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప-2 సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నాడు. కొంత బ్రేక్ తీసుకుని, వచ్చే రెండు రోజుల్లో లండన్ కు వెళ్లనున్నట్టు తెలిసింది. వారికి కావాల్సిన కొలతలు ఇచ్చి రానున్నాడు. ఇక అల్జు అర్జున్ మైనపు విగ్రహాన్ని చూడాలంటే అది వచ్చే ఏడాది సాధ్యపడనుంది.
Also Read : అందుకే వినాయక చవితి కూడా జరుపుకోలేదు..! అసలు కారణం ఏంటో తెలుసా?