ఈ మధ్య కాలంలో స్టేడియంలో ఫ్యాన్స్ తన్నుకునే ఘటనలు ఎక్కువ ఐపోతున్నాయి. ఈ ఏడాది ఐపీఎల్ సమయంలో ఢిల్లీ వర్సెస్ సన్రైజర్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఢిల్లీ అరుణ్ జైట్లీ(arun jaitley) స్టేడియంలో ఈ ఘటన జరగగా.. మరోసారి అవే గ్యాలరీలు కొట్లాటకు వేదికయ్యాయి. వరల్డ్కప్లో భాగంగా ఇండియా(India) వర్సెస్ అఫ్ఘాన్(Afganistan) మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ఇండియా గెలిచిన విషయం తెలిసిందే. ఓవైపు మ్యాచ్లో రోహిత్ శర్మ అఫ్గాన్ బౌలర్లను బాదుటుంటే మరోవైపు స్టేడియంలో కొంతమంది తన్నుకోవడం చర్చనీయాంశమవుతోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. ఢిల్లీ స్టేడియంలో ఫైటింగ్ అంటూ ట్రేండ్ అవుతున్న ఈ వీడియో ఫేకా, రియలా అన్న విషయంపై ఇప్పటివరకు స్పష్టత లేదు. అయితే ఢిల్లీకి చెందిన క్రికెట్ ఫ్యాన్స్ మాత్రం ఇది నిన్నటి మ్యాచ్లో జరిగిన ఘటనే అంటున్నారు.
పూర్తిగా చదవండి..Viral Video: స్టేడియంలోనే తన్నుకున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఇండియా,అఫ్ఘాన్ మ్యాచ్ సమయంలో ఏం జరిగిందంటే?
ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో క్రికెట్ ఫ్యాన్స్ తన్నుకున్న వీడియో సోషల్మీడియాలో వైరల్గా మారింది. గొడవ ఎందుకు జరిగిందో రీజన్ ఇప్పటివరకు తెలియదు కానీ ఒక వ్యక్తిని రౌండ్ చేసి కొంతమంది కొట్టారు. అఫ్ఘాన్ వర్సెస్ ఇండియా మ్యాచ్ సమయంలో ఈ గొడవ జరిగింది.
Translate this News: