Also Read: బిజినెస్ మ్యాన్ కిడ్నాప్… కోట్లు డిమాండ్ చేసిన కిలాడీ దంపతులు
తరుణ్ హత్య కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. ఎస్ఆర్నగర్, బాపునగర్ గల్లీల్లో విచ్చిలవిడిగా గంజాయి బ్యాచ్లు చెలరేగిపోతున్నయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గంజాయి బ్యాచ్ల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండేవని తెలిపారు. బస్తీ గొడవలతోనే తరుణ్ను హత్య చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బోనాల పండుగ సందర్భంగా రౌడీషీటర్ షరీఫ్కు తరుణ్కు మధ్య తీవ్ర ఘర్షణ జరిగిందని బాధిత తల్లి వాపోయింది. ఇద్దరి మధ్య కుటుంబ సభ్యులు రాజీ కుదిర్చినట్లు తెలిపింది. అయినా సరే పగ పెంచుకుని షరీఫ్ ఇంత దారుణానికి ఒడిగట్టాడని తరుణ్ తల్లి వెల్లడించింది. షరీఫ్ని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తోంది.
వెస్ట్ జోన్ డీసీపీ, ఎస్ఆర్ నగర్ ఏసీపీ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. నిందితుడు షరీఫ్ ను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలుపుతున్నారని..అయితే అతడిని అరెస్ట్ చేసినట్లు సరైన ఆధారాలు చూపించడం లేదని బాధత తండ్రి వాపోతున్నాడు. షర్మీఫ్ ను అరెస్ట్ చేసిన పాత ఫొటో చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యువకులకు గంజాయి సప్లై చేస్తూ గ్యాంగ్ నడుపుతున్న షరీఫ్ కచ్చితంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అతిడికి సహకరించిన గ్యాంగ్ ను కూడా అదుపులోకి తీసుకోవాలని తరుణ్ తండ్రి కోరుతున్నాడు.