Hyderabad Traffic: హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ అలర్ట్. ఇవాళ సిటీలో రెండు భారీ ర్యాలీలు జరగనున్నాయి. ఇవాళ సాయంత్రం సిటీకి సీఎం చంద్రబాబు, క్రికెటర్ సిరాజ్ రానున్నారు. సాయంత్రం 6 గంటలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చంద్రబాబు రానున్నారు. చంద్రబాబుకు గ్రాండ్ వెల్కమ్ చెప్పేందుకు టీడీపీ శ్రేణుల ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు ర్యాలీలో 50 కార్లతో పాటు 150 టూ వీలర్స్ ఏర్పాటు చేశారు. బేగంపేట్ ఫ్లై ఓవర్, ప్రజాభవన్, పంజాగుట్ట ఫ్లై ఓవర్ మీదుగా టీడీపీ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టనున్నారు.
మరోవైపు సాయంత్రం హైదరాబాద్కు క్రికెటర్ సిరాజ్ రానున్నారు. సిరాజ్కు ఘనస్వాగతం పలికేందుకు అభిమానుల ఏర్పాట్లు చేశారు. సరోజిని దేవి ఐ హాస్పిటల్, మెహదీపట్నం, ఈద్గా మైదాన్ మీదుగా ర్యాలీ చేయనున్నారు. రెండు ర్యాలీలకు భారీగా జనం హాజరయ్యే ఛాన్స్ ఉంది. వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసుల సూచనలు చేస్తున్నారు.