Drugs Case: బేబీ సినిమాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ తీవ్ర ఆగ్రహం

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు రేగుతున్నాయి. డ్రగ్స్ కేసు విషయంపై మీడియాతో మాట్లాడిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బేబీ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతతో డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా బేబీ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని మండిపడ్డారు.

New Update
Drugs Case: బేబీ సినిమాపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆనంద్ తీవ్ర ఆగ్రహం

Drugs Case: హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు రేగుతున్నాయి. డ్రగ్స్ కేసు విషయంపై మీడియాతో మాట్లాడిన నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ బేబీ సినిమాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతతో డ్రగ్స్ ప్రోత్సహించే విధంగా బేబీ సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని మండిపడ్డారు. ఇటీవల ఫ్రెష్ లివింగ్ అపార్ట్‌మెంట్‌లో రైడ్ చేసినప్పుడు ఉన్న సీన్ చూస్తే.. సేమ్ టు సేమ్ ‘బేబీ’ సినిమాలో ఉన్నట్లే కనిపించాయని తెలిపారు. ఈ ప్రెస్ మీట్‌లో బేబీ సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలను ప్లే చేసి మరీ చూపించారు. సినిమా చూసే నిందితులు ఆ విధంగా పార్టీ చేసుకున్నారని పేర్కొన్నారు.

సినిమాలో ఇలాంటి డ్రగ్స్ సన్నివేశాలు పెట్టి కనీసం హెచ్చరిక ట్యాగ్‌లైన్ కూడా పెట్టలేదని ఫైర్ అయ్యారు. అనంతరం తాము మూవీ యూనిట్‌ను హెచ్చరించిన తర్వాత హెచ్చరిక లైన్ వేశారన్నారు. సినిమాలో డ్రగ్స్ ఏవిధంగా ఉపయోగించాలనే దృశ్యాలను చూపించారన్నారు. యువత చెడు మార్గం పట్టేలా ఇలాంటి అసభ్యకర దృశ్యాలను చిత్రీకరించవద్దని సినిమా రంగానికి విజ్ఞప్తి చేస్తున్నామని వెల్లడించారు. ఇక నుంచి విడుదలయ్యే అన్ని సినిమాలపై పోలీసుల ఫోకస్ ఉంటుందని.. డ్రగ్స్‌కు సంబంధించిన సన్నివేశాలు ఉంటే ఊరుకునేదే లేదని సీపీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

సీపీ ఆనంద్ వ్యాఖ్యలపై బేబీ సినిమా డైరెక్టర్ సాయి రాజేష్ ఆర్టీవీతో స్పందించారు. బుధవారం హైదరాబాద్ పోలిస్ కమిషనర్ నుండీ ఫోన్ వచ్చిందని.. సినిమాలో ఒక సన్నివేశం గురించి ఆరా తీశారని తెలిపారు. అలాంటి సీన్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో వివరణ అడిగారని.. సన్నివేశంలో భాగంగా పెట్టాల్సి వచ్చిందని చెప్పానన్నారు. మాదాపూర్ డ్రగ్స్ కేసులో సేమ్ సీన్స్ ఆనవాళ్లు బయటకు వచ్చాయి అని తనతో చెప్పారని వివరించారు. సమాజంకి మంచి మెసేజ్ ఉండేలా సినిమాలు తీయాలని సూచించారని.. సినిమా రంగానికి కూడా తమ అభ్యంతరం చెప్పాలని తెలిపినట్లు రాజేష్ వెల్లడించారు. అలాగే ఇవాళ అడ్వైజరీ నోటీస్ ఇచ్చారని చెప్పారు. అలాగే తనతో పాటు సినిమా ప్రొడ్యూసర్, నటీనటులు వైష్ణవి చైతన్య, కిర్రక్ సీతలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ఈ నోటీసులపై వివరణ ఇస్తామన్నారు.

మరోవైపు మాదాపూర్ డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తీసుకుంటుంది. ఇప్పటికే ఈ కేసులో నిర్మాత కేపీ చౌదరీ అరెస్ట్ కాగా..మరో ప్రముఖ హీరో పేరు తెర మీదకు వచ్చింది. ఆయనే నవదీప్. అయితే ప్రస్తుతం నవదీప్‌ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలింపు చేపట్టినట్లు సీపీ ఆనంద్ తెలిపారు. ఈ కేసులో సంబంధం ఉన్న ఓ మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌ ను కూడా అరెస్ట్ చేసినట్లు ఆయన వివరించారు. ఇదిలా ఉంటే నవదీప్ మాత్రం తాను పరారీలో లేనని..ఇక్కడే ఉన్నానని ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

Advertisment
తాజా కథనాలు