Crime News: ప్రేమ వివాహం.. భర్త చేతిలో భార్య బలి..!

New Update
Crime News: ప్రేమ వివాహం.. భర్త చేతిలో భార్య బలి..!

Husband Killed his Wife: భార్య భర్తల బంధం అంటే అన్యోన్యతకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పేవారు పెద్దలు . ఎందుకంటే ముక్కు ముఖం తెలియని వారు పెళ్లి అనే బంధంతో ఒక్కటై కొత్త జీవితాన్ని ప్రారంభిస్తూ ఉంటారు. ఇక ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా ఒకరికి ఒకరు తోడు నీడగా ఉంటూ కలకాలం కలిసి ఉంటారు. ఇలా శరీరాలు రెండు అయినా మనసు మాత్రం ఒకటే అనే విధంగా భార్యాభర్తల బంధం ఉంటుంది అని పెద్దలు చెబుతూ ఉంటారు. అయితే పెద్దలు చెప్పింది నిజమే అని చాలామంది పెళ్లి చేసుకున్న వారు. అయితే, ఇటీవల కాలంలో వెలుగులోకి వస్తున్న ఘటనలు చూసిన పెళ్లి అనే మాట వినిపిస్తే చాలు ఉలిక్కి పడుతున్నారు ప్రతి ఒక్కరు. ఎందుకంటే మన సొసైటిలో జరుగుతున్న ఘటనలు అలాంటివి మరి.

తాజాగా, తిరుపతి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. భార్యను అతి దారుణంగా హత్య చేసాడు ఓ భర్త. బత్తలవల్లం హరిజన వాడకు చెందిన కాటయ్య, గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఇరకం పావనీ(26) ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్ధరు చిన్న పిల్లలు ఉన్నారు. అయితే, భార్యభర్తల మధ్య తరుచూ గొడవలు జరుగుతుండేవని స్ధానికులు చెబుతున్నారు. అయితే, ఏం గొడవ జరిగిందో ఏమో తెలియదు కానీ.. నేడు ఉదయం కాటయ్య తన భార్యను అతి కిరాతకంగా చంపాడు. భార్యను హతమార్చిన సంఘటనతో ఒక్కసారిగా  గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు.

వెంటనే  గ్రామస్తుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ శివకుమార్ రెడ్డి, ఎస్ఐ నాగార్జున్ రెడ్డి హత్య జరిగిన ఇంటి పరిసరాలను పరిశీలించారు. నిందితుడు కాటయ్యను పోలీసుల అదుపులో తీసుకున్నారు. పోస్ట్ మార్టం నిమిత్తం వివాహిత మృతదేహాన్ని సత్యవేడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సిఐ మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. భార్య భర్తల మధ్య సరైన సత్సంబంధాలు లేవని గ్రామస్తలు తెలిపిన నేపధ్యంలో హత్యకు గల కారణాలు, కారకులు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు