TS: దారుణం.. భార్యను చంపి ఉరేసుకున్న భర్త ..!

సిరిసిల్ల జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. క్షణికావేశంలో భార్యను చంపి.. భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబకలహాలతోనే భర్త రాజేశం ఈ దారుణానికి పాల్పడట్లు పోలీసులు భావిస్తున్నారు. రాజేశం దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు.

TS: దారుణం.. భార్యను చంపి ఉరేసుకున్న భర్త ..!
New Update

Sircilla : క్షణికావేశంలో భార్యను చంపి.. భర్త ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ దారుణమైన ఘటన సిరిసిల్ల జిల్లాలో  చోటుచేసుకుంది. కుటుంబకలహాలతోనే భర్త రాజేశం ఈ దారుణానికి పాల్పడట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్య ముఖంపై భర్త రాజేశం బలమైన ఆయుధంతో కొట్టి చంపినట్లు తెలుస్తోంది.

రెండు కిడ్నీలు చెడిపోవడంతో రాజేశం డయాలసిస్‌ చేయించుకుంటున్నాడు. 6నెలలుగా ఉద్యోగం చేయకపోవడంతో ఇంట్లో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో భర్త దారుణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. రాజేశం దంపతులకు ఇద్దరు కొడుకులు, ఓ కూతురు ఉన్నారు. ఓ కొడుకు, కూతురికి పెళ్లవగా చిన్నకొడుకు .బీటెక్‌ చదువుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

Also Read : కొత్త ఇళ్ల నిర్మాణంపై సీఎం చంద్రబాబు ఫోకస్‌.. రూ.4 లక్షలకే..



#sircilla
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe