జమ్మూకశ్మీర్ లో భారీ పేలుడు..నలుగురు మృతి!

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లోని పాత ఇనుప దుకాణంలో సంభవించిన భారీ పేలుడులో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు ప్రమదం పై విచారణ చేపట్టారు. మృతులు బారాముల్లా వాసులుగా పోలీసులు గుర్తించారు.

New Update
జమ్మూకశ్మీర్ లో భారీ పేలుడు..నలుగురు మృతి!

జమ్మూకశ్మీర్‌లోని బారాముల్లా జిల్లా సోపోర్‌లోని పాత ఇనుప దుకాణంలో బాంబు పేలింది. పేలుడు సంభవించిన సమయంలో కొందరు వ్యక్తులు దుకాణం వద్ద ట్రక్కు నుంచి పాత సామాన్లు దింపుతున్నారు. మృతులు నసీర్ అహ్మద్ (40), అసిమ్ అష్రఫ్ మీర్ (20), ఆదిల్ రషీద్ బట్ (23), మహ్మద్ అజహర్ (20) గా పోలీసులు గుర్తించారు. మృతులంతా బారాముల్లా జిల్లాలోని షేర్ కాలనీ వాసులుగా తెలుస్తోంది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నారు. ఫోరెన్సిక్ నిపుణుల బృందం ఘటనా స్థలానికి చేరుకుని పేలుడు ఘటన ఎలా జరిగిందనే దాని పై  విచారణ చేపట్టారు.

Advertisment
తాజా కథనాలు