మహేంద్రసింగ్ ధోని.. ఇప్పుడు ఎక్కడ చూసిన ధోని జపం చేస్తున్నారు… ఫ్యాన్స్ కానీ ఎందరు మెచ్చుకున్నా టీమిండియా మాజీ ఓపెనర్ హర్భజన్ సింగ్ అతడిపై విమర్శలు గుప్పిస్తూనే ఉంటాడు. ధోనీపై మరోసారి తన కడుపులోని బాధను వెళ్లగక్కాడు హర్భజన్ సింగ్. అయితే ఈసారి భజ్జీ చేసిన కామెంట్స్ కాస్త ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ అవుతున్నాయి.అవేంటో తెలుసుకుందాం…
భారత క్రికెట్ చరిత్రలో బెస్ట్ కెప్టెన్గా పేరు తెచ్చుకున్నాడు.. మహేంద్ర సింగ్ ధోనీ…. ఆ మాటకొస్తే.. వరల్డ్ క్రికెట్లో అత్యుత్తమ సారథుల లిస్టులో ధోని పేరు కూడా ఉంటుంది. క్రికెట్లో ధోని పట్టిందల్లా బంగారమని చెప్పొచ్చు. ఇది చాలా సార్లు ప్రూవ్ చేసుకున్నాడు కూడా. భారత జట్టుకు రథసారథిగా టీ20, వన్డే వరల్డ్ కప్లతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని అందించాడు మాహీ. అలాగే టెస్టుల్లో టీమిండియాను నంబర్ వన్ ప్లేసుకు చేర్చాడు. ఇక, ఇండియన్ ప్రీమియర్ లీగ్లోనూ చెన్నై సూపర్ కింగ్స్కు ఐదు సార్లు టైటిల్ అందించాడు. ఐపీఎల్ పదహారో సీజన్లోనూ సీఎస్కే కప్ గెలవడంలో తనవంతు కృషిని అందించాడు ధోని. మాహీని ఎందరు మెచ్చుకున్నా టీమిండియా మాజీ ఓపెనర్ హర్భజన్ సింగ్ మాత్రం అతడిపై విమర్శలు చేస్తూనే ఉంటాడు.
ఇంతకీ హర్భజన్ సింగ్ ఏమన్నాడంటే.. ‘ఐసీసీ టోర్నీల్లో భారత్ వరుస వైఫల్యాలకు కారణం మనం వ్యక్తిగత ప్రదర్శనలకు ఇచ్చిన ప్రాధాన్యం టీమ్ పెర్ఫార్మెన్స్కు ఇవ్వకపోవడమే. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్లు సమిష్టి ప్రదర్శనకు పెద్దపీట వేస్తాయి. 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్లో ఇండియా విజేతగా నిలిచిందంటే అందుకు ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ ప్రధాన కారణం. ఆ రెండు టోర్నీల్లోనూ యువీనే టీమ్ను ఫైనల్కు చేర్చాడు. కానీ పీఆర్ ఏజెన్సీలు మాత్రం ధోనీని హీరోను చేసేశాయి’ అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓడిన నేపథ్యంలో.. ఐసీసీ టోర్నమెంట్లలో గెలవడం ధోనీకే సాధ్యం అన్నట్లు అందరూ అతడ్ని పొగుడుతున్నారు.