చాలామంది సమస్యను ముందుగా గుర్తించకపోవడంతో శస్త్రచికిత్సల వరకు వెళ్లాల్సి వస్తోంది. తగినంత నీరు తాగకపోవడం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి ఒక ప్రధాన కారణం. మూత్రంలో రక్తం రావడం కిడ్నీలో రాళ్లు ఉన్నయనడానికి సంకేతం. దీన్ని హెమటూరియా అని పిలుస్తారు. ఈ సమయంలో మూత్రం ఎరుపు, గులాబీ లేదా గోధుమ రంగులో కనిపించవచ్చు.కొన్ని సందర్భాల్లో రక్త కణాలు మైక్రోస్కోప్ లేకుండా చూడలేనంత చిన్నవిగా ఉంటాయి. అప్పుడు వైద్యుడు మూత్రాన్ని పరీక్షించి రక్తం ఉందా లేదా అని నిర్ధారిస్తారు. కొందరికి మూత్ర విసర్జన సమయంలో విపరీతమైన నొప్పి వస్తుంది. కిడ్నీని , మూత్రాశయాన్ని కలిపే ట్యూబ్ మధ్య కిడ్నీలో రాళ్లు ఏర్పడితే ఈ నొప్పి ఉంటుంది. దీన్ని డైసూరియా అని పిలుస్తారు.
పూర్తిగా చదవండి..ఈ లక్షణాలు గుర్తిస్తే కిడ్నిలో రాళ్ల సమస్యను పరిష్కరించవచ్చు!
ప్రస్తుత కాలంలో కిడ్నీలో రాళ్లు సాధారణ సమస్యగా మారింది. ఖనిజాలు, సోడియం మూత్రపిండాల్లో పేరుకుపోయినప్పుడు ఈ రాళ్లు ఏర్పడతాయి. తగినంత నీరు తాగకపోవడం కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి ఒక ప్రధాన కారణం. కిడ్నీల్లో రాళ్లు ఏర్పడితే ముందుగా ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం.
Translate this News: