ముందు సుజనాచౌదరి అన్నారు.. తర్వాత సత్యకుమార్ అన్నారు..కానీ ఏపీ బీజేపీ చీఫ్గా పురందేశ్వరిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అవ్వడంతో అంతా షాక్ అయ్యారు. అసలు నిన్నమొన్నటివరకు ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి రేసులో ఆమె పేరే ఎక్కడా వినిపించలేదు.. అలాంటిది సడన్గా ఆమెని ఎన్నిక చేయడంతో సామాన్యులే కాదు.. మిగిలిన పార్టీ నేతలు సైతం ఆశ్చర్యపోయారు. క్రికెట్లో కంకషన్ ప్లేయర్ తరహాలో ఆమె సడన్ ఎంట్రీ ఏపీ బీజేపీలో జోష్ నింపిందనే చెప్పాలి. ఎందుకంటే దెబ్బతగిలి ఉన్న ఆటగాడి స్థానంలో కంకషన్ ప్లేయర్ ఎలా అయితే బరిలోకి దిగుతాడో.. పురందేశ్వరి కూడా అలానే ఎదురుదెబ్బలు తగిలున్న పార్టీని నిలబెట్టేందుకు రంగంలోకి దూకారు. ఇంతకీ పురందేశ్వరిని బీజేపీ హైకమాండ్ ఎందుకు సెలక్ట్ చేసింది..? ఇప్పుడిదే ప్రశ్న చాలా మంది బుర్రల్లో గిర్రున తిరుగుతోంది. దానికి ప్రధానంగా 10కారణాలు కనిపిస్తున్నాయి.
పూర్తిగా చదవండి..AP BJP: ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురందేశ్వరిని నియమించడానికి కారణాలివే..!
బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీలో సంస్థాగతంగా కీలక మార్పులు చేస్తుంది. ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా దగ్గుబాటి పురందేశ్వరిని నియమిస్తూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవి రేసులో వై సత్యకుమార్, సుజనా చౌదరి ఉన్నప్పటికీ సీనీయర్ మహిళా నేత పురందేశ్వరి వైపే బీజేపీ అధిష్టానం మొగ్గు చూపింది.
Translate this News: