దేశవ్యాప్తంగా రుతుపవనాల బీభత్సం కొనసాగుతోంది. గుజరాత్, రాజస్థాన్ నుండి కేరళ వరకు, బీహార్ నుండి హిమాచల్-ఉత్తరాఖండ్ వరకు వర్షాలు దంచికొడుతున్నాయి. గుజరాత్లోని పలు నగరాలు కూడా వర్షంతో తడిసిముద్దయ్యాయి. ఇళ్లు, దుకాణాల్లోకి వర్షం నీరు చేరింది. బీహార్లో ఆసుపత్రి నదిలా మారింది. ఇటు తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లోనూ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు చోట్ల పిడిగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసింది. రెండు రాష్ట్రాల్లోనూ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణశాఖ.
పూర్తిగా చదవండి..దేశవ్యాప్తంగా దంచికొడుతున్న వానలు..చాలా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..!!
దేశవ్యాప్తంగా రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో విస్తారంగా వర్షాలు కురుస్తున్నారు. చాలా రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కరుస్తుండటంతో అనేక రాష్ట్రాల్లో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. వరదలు పోటెత్తుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ నుంచి..కేరళ వరకు ప్రతి రాష్ట్రంలోనూ భారీ వర్షాలు కురుస్తున్నాయి. గుజరాత్ లో పలు నగరాలు తడిసిముద్దయ్యాయి. బీహార్ లో ఆసుపత్రి నదిలా మారింది. రాజస్థాన్ లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. గుజరాత్ లో కురుస్తున్న భారీ వర్షాలకు నదియాడ్ అండర్ పాస్ లో నీటితో నిండిపోయింది. కారు పడవలా తేలుతూ నలుగురి ప్రాణాలు కాపాడింది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తున్నాయి.
Translate this News: