భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Badrachalam) డివిజన్ వ్యాప్తంగా వాన దంచికొడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భద్రాచలం వద్ద గోదావరి(godavari) నీటిమట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. అధికారులు ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించారు. వర్షాల వల్ల వచ్చే ప్రమాదాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. చర్ల మండలం తాళి పేరు వద్ద వరద వర్షం కారణంగా భారీగా పెరుగుతోంది. తాళి పేరు అధికారులు సుమారు 18 గేట్ల ద్వారా 63 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు 70 వేల క్యూసుక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 39.6 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు.
పూర్తిగా చదవండి..Godavari Flood:గోదావరికి పోటెత్తిన వరద..భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరిన నీటిమట్టం
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 39.6 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు.
Translate this News: