Godavari Flood:గోదావరికి పోటెత్తిన వరద..భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరిన నీటిమట్టం

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 39.6 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు.

New Update
Godavari Flood:గోదావరికి పోటెత్తిన వరద..భద్రాచలం వద్ద 40 అడుగులకు చేరిన నీటిమట్టం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం(Badrachalam) డివిజన్ వ్యాప్తంగా వాన దంచికొడుతోంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి భద్రాచలం వద్ద గోదావరి(godavari) నీటిమట్టం కూడా క్రమక్రమంగా పెరుగుతుంది. చర్ల, దుమ్ముగూడెం ప్రాంతాలలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. అధికారులు ఇప్పటికే ముందస్తు చర్యలు ప్రారంభించారు. వర్షాల వల్ల వచ్చే ప్రమాదాలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. చర్ల మండలం తాళి పేరు వద్ద వరద వర్షం కారణంగా భారీగా పెరుగుతోంది. తాళి పేరు అధికారులు సుమారు 18 గేట్ల ద్వారా 63 వేల క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు 70 వేల క్యూసుక్కుల నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి 39.6 అడుగుల వద్ద ప్రవహిస్తుంది. 43 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రియాంక సూచించారు.

అక్కడ కూడా అదే పరిస్థితి?
మరోవైపు తూర్పుగోదావరి జిల్లా గోదావరికి వద్ద కూడా వరద ఉధృతి కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు నుంచి 3,15,791 క్యూసెక్కుల వరద నీరును దిగువకు విడుదల చేశారు. ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద క్రమంగా వరదనీరు పెరుగుతోంది. ధవలేశ్వరం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 9.20అడుగులగా ఉంది. 4లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. అటు లంక గ్రామాలకు వరద చేరుకుంటుండడం కలవర పెడుతోంది.

మరోవైపు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వస్తున్న వరద నీటితో ములుగు-మంగపేట వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతుంది. గోదావరి ఎగువన ఉన్న మహారాష్ట్ర, కాళేశ్వరం, ఛత్తీస్ ఘడ్, ఒరిస్సాలోని పలు గోదావరి తీర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వరదనీరు వచ్చి చేరుతోంది. వరద పరిస్థితి కొనసాగితే గోదావరి నీటిమట్టం మరో పది అడుగుల మేర పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. మండల వ్యాప్తంగా 60.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.

నిండుకుండల్లా  ప్రాజెక్టులు

ఇటు కాళేశ్వరం దగ్గర గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పుష్కరఘాట్‌ వద్ద 9.770 మీటర్ల ఎత్తులో ఈ రెండు నదులు ప్రవహిస్తున్నాయి. ఇక మేడిగడ్డ, లక్ష్మీ బ్యారేజ్‌ 57 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 4,85,030 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లక్ష్మీబ్యారేజ్‌ ఇన్‌ఫ్లో 4,38,880 క్యూసెక్కులు కాగా.. ఔట్‌ ఫ్లో 4,85,030 క్యూసెక్కులుగా ఉంది. ఇక కడెం ప్రాజెక్టు పూర్తిస్తాయి నీటి మట్టం 700 అడుగులు కాగా, 690.500 అడుగులకు చేరింది. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 7,283 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. దీంతో ఒక గేటును రెండు అడుగుల మేర ఎత్తి 2,865 క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Weight Lose: ఇలా చేశారంటే వేసవిలో సులభంగా బరువు తగ్గొచ్చు

బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చు. 

New Update

Weight Lose: సరైన ఆహారం తీసుకుంటే వేసవిలో బరువు తగ్గడం శీతాకాలంలో కంటే సులభం అవుతుంది. ఆహారంలో ఫైబర్ అధికంగా ఉండే సలాడ్లు, ఆరోగ్యకరమైన డ్రింక్స్‌ చేర్చుకోవడం ద్వారా సులభంగా బరువు తగ్గవచ్చు. శీతాకాలంలో బరువు తరచుగా పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి మనం అధిక కేలరీల ఆహారాన్ని తీసుకుంటాం. అయితే బరువు తగ్గడానికి వేసవి కాలం ఉత్తమం. ఈ సీజన్‌లో అధిక ఉష్ణోగ్రత కారణంగా ఎక్కువగా చెమట పడుతుంది. ఇది కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది.

కాలేయం ఆరోగ్యంగా..

వేసవిలో పుచ్చకాయ సులభంగా దొరుకుతుంది. బరువు తగ్గడానికి ఇది ఒక గొప్ప పండు. ఇందులో పుష్కలంగా నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది. డీహైడ్రేషన్‌ను నివారిస్తుంది. అలాగే ఇందులో ఉండే విటమిన్ సి, లైకోపీన్ ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. పుచ్చకాయ తినడం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి సలాడ్ ఒక సులభమైన, ప్రభావవంతమైన పరిష్కారం. ఈ సీజన్‌లో దోసకాయ, గెర్కిన్, బ్రోకలీ, టమోటా వంటి తక్కువ కేలరీల ఆహారాలు సులభంగా లభిస్తాయి. వాటిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి.

ఇది కూడా చదవండి: శరీరంలోని అధిక నీటిశాతం తగ్గించే చిట్కాలు

కడుపు చాలా సేపు నిండినట్లు అనిపిస్తుంది.  సలాడ్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఐస్ టీ వేడి నుండి ఉపశమనం కలిగించడమే కాకుండా శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో కూడా సహాయపడుతుంది. దీన్ని పుదీనా, నిమ్మకాయ, బెర్రీలతో కలిపి తాగవచ్చు. ఈ పానీయం జీవక్రియను వేగవంతం చేస్తుంది. కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. రోజూ ఒక గ్లాసు ఐస్ టీ తాగడం వల్ల బరువు తొందరగా తగ్గవచ్చంటున్నారు నిపుణులు. వేసవిలో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి కొబ్బరి నీళ్లు ఒక గొప్ప ఎంపిక. ఇది శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచే ఎలక్ట్రోలైట్లను కలిగి ఉంటుంది. కొబ్బరి నీరు జీర్ణక్రియను మెరుగుపరచడమే కాకుండా జీవక్రియను కూడా పెంచుతుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.

ఇది కూడా చదవండి: భోజనం చేసేప్పుడు నీళ్లు తాగకూడదని ఎందుకు చెబుతారు?

(weight-lose | weight-lose-exercises | vegetable-juices-for-weight-lose | latest-news | health-tips | health tips in telugu | latest health tips | best-health-tips)

 

Advertisment
Advertisment