Health Tips: ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగే అలవాటు ఉందా? అయితే, ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..

మనలో చాలా మంది భోజనానికి ముందు, మరికొందరు తిన్న తర్వాత నీరు తాగుతుంటారు. కొంతమందికి భోజనం చేసిన వెంటనే లేదా భోజనం చేస్తున్నప్పుడే నీరు ఎక్కువగా తాగుతుంటారు. అయితే, తిన్న తర్వాత నీళ్లు తాగితే ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుంది.

Health Tips: ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగే అలవాటు ఉందా? అయితే, ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..
New Update

Drinking Water after Meal: మనలో చాలా మంది భోజనానికి ముందు, మరికొందరు తిన్న తర్వాత నీరు తాగుతుంటారు. కొంతమందికి భోజనం(Food) చేసిన వెంటనే లేదా భోజనం చేస్తున్నప్పుడే నీరు ఎక్కువగా తాగుతుంటారు. అయితే, తిన్న తర్వాత నీళ్లు తాగితే ఆరోగ్యంపై(Health) దుష్ప్రభావం చూపుతుంది. జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. 'నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్' అధ్యయనం ప్రకారం, ఘన పదార్థాల కంటే ఎక్కువ నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఘన ఆహారం జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. నీటికి సమయం అవసరం లేదు. అయితే, ఈ రెండింటిని తీసుకునే సమయం వేరు వేరుగా ఉంటే సమస్య ఉండదని, ఆహారం తింటూ అధికంగా నీరు తాగితే సమస్య వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

టైమ్ పాటించాలి..

తిన్న వెంటనే నీరు త్రాగడం వల్ల పొట్టలోని జీర్ణ రసాలను పలుచన అవుతాయి. అందుకే.. తినడానికి ఓ 30 నిమిషాల ముందు గానీ, తిన్నాక 30 నిమిషాల తరువాత గానీ నీరు తాగడం ఉత్తమం అని నిపుణులు సూచిస్తున్నారు. ఆహారం మధ్యలో నీళ్లు తాగడం వలన సరిగా జీర్ణం కాదు.

అధికంగా నీరు తాగొద్దు..

హైడ్రేటెడ్‌గా ఉండటం ముఖ్యం. అయితే, భోజనం సమయంలో లేదా తర్వాత ఎక్కువ నీరు త్రాగడం వల్ల కడుపు ఉబ్బరం, అసౌకర్యం కలుగుతుంది. ఒకేసారి పెద్ద గ్లాసు నీరు త్రాగే బదులు, చిన్న సిప్స్ తీసుకోండి. రోజంతా హైడ్రేటెడ్ గా ఉండటానికి ఇది ఉత్తమమైన మార్గం.

వేడి నీరు vs చల్లని నీరు..

భోజనానికి ముందు లేదా తర్వాత గోరువెచ్చని నీటిని తాగడం జీర్ణక్రియకు సహాయపడుతుందని కొందరు భావిస్తారు. గోరువెచ్చని నీరు జీర్ణాశయంలోని కండరాలకు విశ్రాంతినిస్తుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది.

నీటి ప్రయోజనాలు..

సరైన సమయంలో నీరు త్రాగితే జీర్ణక్రియకు నిజంగా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది ఆహారాన్ని మృదువుగా చేయడానికి, విచ్ఛిన్నం చేయడానికి సహాయపడుతుంది. మీ శరీరం పోషకాలను జీర్ణం చేయడాన్ని సులభతరం చేస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి తగినంత ఆర్ద్రీకరణ అవసరం.

అవసరాన్ని బట్టి నీరు తాగాలి..

భోజనం సమయంలో లేదా తర్వాత నీటి తీసుకోవడం వలన కడుపులో కొంత మార్పులు రావొచ్చు. కొందరు వ్యక్తులు తిన్న వెంటనే నీరు త్రాగితే అసౌకర్యంగా ఫీలవుతారు. మరికొందరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మీ శరీరం ఎలా స్పందిస్తుందో గమనిస్తూ.. తదనుగుణంగా నీటిని తీసుకోవాలి.

సమతుల్య ఆహారం ముఖ్యం..

నీరు ఎప్పుడు త్రాగాలి అనే దానిపై మాత్రమే దృష్టి పెట్టకుండా, సమతుల్య ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వండి. వివిధ రకాల పోషకాలు కలిగిన ఆహారాలు తినడం, మీ ఆహారాన్ని పూర్తిగా నమలడం వలన మంచి జీర్ణక్రియకు దోహదపడుతుంది. ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు, పండ్లు, కూరగాయలు కూడా జీర్ణ వ్యవస్థను కాపాడుకోవడానికి సహాయపడతాయి.

Also Read:

India to Bharat: ‘ఇండియా’ పేరును భారత్‌గా మార్చడం సులభమేనా? ప్రాసెస్ ఎంత ఉంటుందో తెలిస్తే షాక్ అవుతారు..

ISRO: చంద్రుడికి సంబంధించి మరో బ్యూటీఫుల్ పిక్ షేర్ చేసిన ఇస్రో.. ఓసారి చూసేయండి..

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి