మధ్యప్రదేశ్ రాజకీయాలు మూత్రం కేసు చుట్టూ తిరుగుతున్నాయి. గిరిజన కూలీ దాస్మేష్ రావత్పై ప్రవేష్ శుక్లా అనే వ్యక్తి మద్యం మత్తులో ముఖంపై మూత్రం పోయడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రవేశ్ శుక్లా ఓ బీజేపీ ఎమ్మెల్యే సన్నిహితుడిగా ప్రచారం జరగడం.. ఘటనపై సీఎం శివరాజ్సింగ్ చౌహన్ స్పందించడం.. నిందితుడు అరెస్ట్ కావడం చకాచకా జరిగిపోయాయి. ఆ తర్వాత రావత్ ఇంటికి వెళ్లిన చౌహన్ బాధితుడి కాళ్లు కడిగారు. ఇదంతా పొలిటికల్ స్టంట్ అని ఓవైపు కాంగ్రెస్ మండిపడుతుండగా.. బాధితుడు రావత్ తాజాగా ట్విస్ట్ ఇచ్చారు. ప్రవేశ్ శుక్లాని విడిచిపెట్టాలని.. అతను తన తప్పు తెలుసుకున్నాడంటూ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పూర్తిగా చదవండి..Urination case: నాపై మూత్రం పోసిన అతన్ని విడిచిపెట్టండి.. మధ్యప్రదేశ్ ఘటనలో షాకింగ్ ట్విస్ట్..!
మధ్యప్రదేశ్ మూత్రం కేసు ఘటనలో మరో ట్విస్ట్. నిందితుడు ప్రవేశ్ శుక్లాను విడిచిపెట్టాలని బాధితుడు రావత్ కోరడం సంచలనంగా మారింది. ప్రవేశ్ తన తప్పును తెలుసుకున్నాడని..అందుకే వదిలిపెట్టాలని రావత్ కోరాడు.
Translate this News: