ఆ తల్లికి కొడుకు అంటే పిచ్చి ప్రేమ. కొడుకు లేకుంటే బతకలేను అనుకుంది. కొడుకు మరణవార్త తెలియగానే ఆత్మహత్యకు పాల్పడింది. కెనడాలో పంజాబ్ కు చెందిన విద్యార్థి గుర్విందర్ నాథ్ జూలై 14న దుండగుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. గుర్విందర్ నాథ్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం షాహీద్ భగత్ సింగ్ నగర్ జిల్లాకు తీసుకొస్తున్న క్రమంలో కుమారుడు మరణించినట్లు తల్లికి చెప్పారు. దీంతో ఆ తల్లి ఒక్కసారిగా షాక్ గురయ్యింది. నువ్వులేని లోకంలో నేను ఉండలేనంటూ..ఆ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో షాహీద్ భగత్ సింగ్ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా ఈరోజు సాయంత్రం గుర్విందర్ నాథ్ మృతదేహం భారత్ కు రానుంది.
పూర్తిగా చదవండి..నువ్వు లేని లోకంలో నేను ఉండలేనంటూ.. కెనడాలో హత్యకు గురైన విద్యార్థి.. తల్లి ఆత్మహత్య..!!
కెనడాలో భారతీయ విద్యార్థి గుర్విందర్ నాథ్ జూలై 14న దుండగుల దాడిలో తీవ్రగాయాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. పంజాబ్ కు చెందిన గుర్విందర్ నాథ్ మృతదేహాన్ని అంత్యక్రియల కోసం తన స్వగ్రామానికి తరలించారు. అప్పటి వరకు తన కొడుకు మరణవార్త ఆ తల్లికి తెలియదు. చివరి నిమిషంలో తెలియడంతో...తట్టుకోలేని ఆ తల్లి ఆత్మహత్యకు పాల్పడింది.
Translate this News: