తెలంగాణలో మరోసారి ఉగ్రమూలలు భయటపడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే పాతబస్తీలోని పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు…రామగుండంలోని తండ్రీ కూతుళ్లను అరెస్టు చేశారు. గతకొన్నేళ్లుగా హైదరాబాద్ లో ఉంటున్న తండ్రీకూతుళ్లు నాలుగు రోజులుగా రామగుండంలో తలదాచుకుంటున్నట్లు వచ్చిన పక్కా సమాచారంతో గుజరాత్ ఏటీఎస్ తనిఖీ చేసి వారిద్దర్నీ అరెస్టు చేసింది.
పూర్తిగా చదవండి..తెలంగాణలో టెర్రరిస్టుల కలకలం…!!
తెలంగాణలో టెర్రరిస్టుల కార్యకలాపాలు కలకలం రేపుతున్నాయి. గుజరాత్ లోని ఉగ్రవాద అనుమానితుడితో తెలంగాణలోని రామగుండంకు చెందిన అమ్మాయి చాట్ చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఫేస్ బుక్ ద్వారా పరిచయం ఏర్పడి చాట్ జరిగింది. అయితే ఇది మామూలుగానే జరిగిన సంభాషణా లేదా మరేదైనా ఉగ్రకోసం ఉందా అని తేల్చేపనిలో ఏటీఎస్ ఉంది.
Translate this News: