GST Collections: మళ్ళీ లక్షన్నరకోట్లకు పైగా.. జీఎస్టీ వసూళ్ల పరుగు.. 

జీఎస్టీ వసూళ్లు నవంబర్ నెలలో 1.67 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి. ఇలా లక్షన్నర కోట్ల రూపాయలను దాటి జీఎస్టీ వసూళ్లు రావడం వరుసగా ఇది తొమ్మిదో సారి. గత 21 నెలల నుంచి 1.41 లక్షల కోట్ల రూపాయలకు తగ్గకుండాఉన్నాయి. 

New Update
GST Collections: రికార్డ్ సృష్టించిన జీఎస్టీ కలెక్షన్స్.. ఈ లెక్కలు చూస్తే మతిపోతుంది!

GST Collections: నవంబర్ 2023లో వస్తు సేవల పన్ను అంటే GST ద్వారా ప్రభుత్వం రూ. 1.67 లక్షల కోట్లు వసూలు చేసింది. ఇది ఏడాది క్రితం అంటే నవంబర్ 2022 కంటే 15% ఎక్కువ. అప్పుడు జీఎస్టీ ద్వారా రూ.1.46 లక్షల కోట్లు వసూలయ్యాయి. నెల రోజుల క్రితం అక్టోబర్‌లో జీఎస్టీ ద్వారా ప్రభుత్వం రూ.1.72 లక్షల కోట్లు వసూలు చేసింది.1.5 లక్షల కోట్లకు పైగా వసూళ్లు(GST Collections) రావడం ఇది వరుసగా 9వ సారి. అయితే, ఇప్పటి వరకు అత్యధిక జీఎస్టీ వసూళ్లు ఏప్రిల్ 2023లో నమోదయ్యాయి.  ఈ సంఖ్య రూ. 1.87 లక్షల కోట్లు దాటింది. ఇది కాకుండా, దేశ జిఎస్‌టి వసూళ్లు వరుసగా 21 నెలలుగా రూ.1.4 లక్షల కోట్ల కంటే ఎక్కువగానే ఉన్నాయి.

జీఎస్టీ వసూళ్ళలో CGST రూ. 30420 కోట్లు, SGST రూ. 38226 కోట్లు. ఉన్నట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది- నవంబర్ 2023 లో GST వసూళ్లు రూ. 1,67,929 కోట్లు. ఇందులో సీజీఎస్టీ రూ.30,420 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.38,226 కోట్లు, ఐజీఎస్టీ రూ.87,009 కోట్లు (వస్తువుల దిగుమతులపై వసూలు చేసిన రూ. 39,198 కోట్లతో కలిపి), సెస్ రూ.12,274 కోట్లు ఉన్నాయి.  సెస్‌లో వస్తువుల దిగుమతి ద్వారా వచ్చిన రూ.1,036 కోట్లు ఉన్నాయి.

FY24లో ఇప్పటివరకు రూ.13.32 లక్షల కోట్లు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ. 13.32 లక్షల కోట్ల జిఎస్‌టి వసూళ్లు(GST Collections) జరిగాయి. అంటే,  గత 8 నెలల్లో, ఇప్పటివరకు మొత్తం రూ. 13.32 లక్షల కోట్ల జిఎస్‌టి వసూళ్లు జరిగాయి. గత ఆర్థిక సంవత్సరం 2022-23లో మొత్తం జీఎస్టీ వసూళ్లు రూ.18.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. 

Also Read: జనం వద్ద రూ. 2వేల నోట్లు ఇంకా ఎన్నున్నాయో తెలుసా!.. ఆర్బీఐ లెక్క చెప్పింది

GST వసూళ్లలో మహారాష్ట్ర అగ్రస్థానం
నవంబర్ 2023లో GST వసూళ్ల(GST Collections) పరంగా టాప్-3 రాష్ట్రాలలో మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉంది. గత ఏడాదితో పోలిస్తే మహారాష్ట్రలో జీఎస్టీ వసూళ్లు 17% పెరిగి రూ.21,611 కోట్లకు చేరాయి. ఈ జాబితాలో రూ.10,238 కోట్ల వసూళ్లతో కర్ణాటక రెండో స్థానంలోనూ, రూ.9,333 కోట్ల వసూళ్లతో గుజరాత్ మూడో స్థానంలోనూ ఉన్నాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో నవంబర్ నెలలో జీఎస్టీ వసూళ్లు 4,986 కోట్లు. ఇది గత సంవత్సరం ఇదే నెల కంటే 18 శాతం ఎక్కువ. అలాగే ఆంధ్రప్రదేశ్ లో నవంబర్ జీఎస్టీ వసూళ్లు 4.093 కోట్లు. గత సంవత్సరం నవంబర్ వసూళ్ల కంటే ఇక్కడ 31 శాతం వసూళ్లు పెరిగాయి. 

జీఎస్టీ  2017 నుంచి అమలులోకి వచ్చింది.. 

GST అనేది పరోక్ష పన్ను. గతంలో ఉన్న అనేక పరోక్ష పన్నులు (VAT), సేవా పన్ను, కొనుగోలు పన్ను, ఎక్సైజ్ సుంకం మరియు అనేక ఇతర పరోక్ష పన్నుల స్థానంలో ఇది 2017లో అమలు చేయబడింది. GSTలో 5, 12, 18 మరియు 28% నాలుగు శ్లాబులు ఉన్నాయి.

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు