పాలమూరు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాధించడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తంచేశారు. కరివెన రిజర్వాయర్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, జలాభిషేకం చేశారు. ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగించిన కేసీఆర్‌కు యావత్ ఉమ్మడి జిల్లా తరఫున పాదాభివందనం చేస్తున్నామని శ్రీనివాస్‌ గెడ్డి వెల్లడించారు.

పాలమూరు ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్.. సీఎం కేసీఆర్ చిత్రపటానికి జలాభిషేకం
New Update

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు సాధించినందుకు రాష్ట్ర ప్రజల తరఫున సీఎం కేసీఆర్‌కు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రాజెక్టుకు ఈఏసీ గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడంపై ఆయన హర్షం వ్యక్తంచేశారు. కరివెన రిజర్వాయర్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం, జలాభిషేకం చేశారు. ఎడారిగా మారిన తెలంగాణను సస్యశ్యామలం చేయాలని సీఎం పడిన తపన ఎంతో గొప్పదని కొనియాడారు. ఆర్డీఎస్ షటర్లు బద్దలు కొట్టి తాగునీటిని ఆంధ్రకు తరలించుకుపోయినా ఆనాటి ముఖ్యమంత్రులు ఏనాడూ స్పందించలేదన్నార. పాలమూరు గోసను చూసిన ఉద్యమనేత కేసిఆర్ జోగులాంబ నుంచి పాదయాత్ర చేశారన్నారు. ప్రాజెక్ట్ అడ్డుకోవడం కోసం ప్రతిపక్షాలు ఎన్నో కుట్రలు చేశాయని ఆరోపించారు. కేంద్రం అనేక కొర్రీలు వేసిందని.. మన ప్రాంతం నాయకులే కేసులు వేసి ప్రాజెక్టును అడ్డుకునేందుకు కుట్రలు చేశారని మండిపడ్డారు.

పాలమూరు ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఏ ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా తమ పరిశీలనలో లేదని చెప్పిన కేంద్రం కర్ణాటకలోని అప్పర్ భద్రకు మాత్రం జాతీయ హోదా ఇచ్చి తెలంగాణ ప్రజలను దగా చేసిందని విమర్శించారు. ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీటిని అందించిన కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి జిల్లాను సస్యశ్యామలం చేయబోతున్నారని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు రావడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రజలు పండుగ చేసుకుంటున్నారని ఆనందం వ్యక్తంచేశారు. మరో రెండు మూడు నెలల్లో పాలమూరు ప్రాజెక్టు ద్వారా నీటిని అందిస్తామని చెప్పారు. ఎవరైనా మళ్లీ ప్రాజెక్టు పనులను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే కాలువల్లో వేసి తొక్కేస్తాం... వెంటాడి తరిమి కొడతామని హెచ్చరించారు.

పాలమూరు ప్రజల బతుకుదురువే సాగునీరు.. ఆ సాగునీరు రాకుండా అడ్డుకుంటే ఊరుకుంటామా అని మంత్రి పేర్కొన్నారు. పర్యావరణ అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వం పట్టుదలతో కృషి చేసిందన్నారు. పర్యావరణ అనుమతులతో దశాబ్దాలుగా వివక్షకు గురైన ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు పాలమూరు ప్రాజెక్టు ద్వారా కృష్ణమ్మ నీటిని మళ్లించి సస్యశ్యామలం చేస్తామని తెలిపారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి నీటి నిల్వ సామర్థ్యం లేకుండా రిజర్వాయర్లు నిర్మించకుండా అన్యాయం చేసిన ఘనత గత పాలకులదని ఆయన వివరించారు. పాలమూరు ప్రాజెక్టును కల్వకుర్తి ప్రాజెక్టుతో అనుసంధానిస్తామని.. భవిష్యత్తులో కాలేశ్వరం జలాలను కూడా పాలమూరుకు తరలిస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టుకు అన్ని అడ్డంకులు తొలగించిన కేసీఆర్‌కు యావత్ ఉమ్మడి జిల్లా తరఫున పాదాభివందనం చేస్తున్నామని శ్రీనివాస్‌ గెడ్డి వెల్లడించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe