/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/akshaya-tritiya-2024-1-1024x576.png)
Akshaya Trithiya 2024: బంగారం ధరలు సరికొత్త గరిష్టాలను తాకుతూ పరుగులు తీస్తున్నాయి. ఎల్లుండే అక్షయ తృతీయ. ఒకవేళ మీరు అక్షయ తృతీయ నాడు బంగారు ఆభరణాలు కొనాలని ప్లాన్ చేస్తుంటే, మీరు కొన్ని విషయాలు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఉదాహరణకు, బంగారు ఆభరణాల ధరను ఎలా నిర్ణయిస్తారు, ఆభరణాలు రాళ్లతో చేసినట్లయితే, బంగారు ఆభరణాల ధరలలో తేడా ఉందా .. మేకింగ్ ఛార్జీకి ఎంత తేడా వస్తుంది మొదలైనవి.
బంగారు ఆభరణాలను ఎలా లెక్కిస్తారు?
Akshaya Trithiya 2024: వ్యాపారులు బంగారం కొనుగోలు చేసే ధరలో రిఫైనింగ్ ఖర్చులు, రవాణా ఖర్చులు మొదలైన అనేక ఖర్చులు ఉంటాయి. అందువల్ల బంగారం ధరలు ఒక్కొక్క ఆభరణాలను బట్టి మారుతూ ఉంటాయి. సాధారణంగా బంగారు ఆభరణాల తుది ధరను లెక్కించేందుకు నగల వ్యాపారులు ఉపయోగించే ఫార్ములా ఇలా ఉంటుంది –
ఆభరణాల తుది ధర = {బంగారం ధర X (గ్రాముల బరువు)} + మేకింగ్ ఛార్జ్ + 3% GST + హాల్మార్కింగ్.
బంగారం ధర మీరు కొనుగోలు చేసిన క్యారెట్ (KT)పై ఆధారపడి ఉంటుంది. ఇది 24KT, 22KT, 18KT, 14KT మొదలైనవి కావచ్చు. వీటిలో ఒక్కో ధర ఒక్కో విధంగా ఉంటుంది. స్వచ్ఛమైన బంగారం ధర ఎక్కువగా ఉంటుంది.
Also Read: అక్షయ తృతీయ.. బంగారంపై బంపర్ ఆఫర్స్.. ఎక్కడంటే..
మేకింగ్ ఛార్జీ ఎంత?
Akshaya Trithiya 2024: నగల వ్యాపారులు బంగారు ఆభరణాలపై మేకింగ్ ఛార్జీలు కూడా వసూలు చేస్తారు. సాధారణంగా, ఇవి ప్రతి గ్రాము ఆధారంగా లేదా శాతం ఆధారంగా లెక్కిస్తారు. కొంతమంది స్వర్ణకారులు ఈ రెండింటి మిశ్రమాన్ని ఉపయోగిస్తారు. వారు ప్రస్తుతం ఉన్న బంగారం ధరలో 1% వినియోగిస్తారు. ఆపై ప్రతి గ్రాము ఆధారంగా వసూలు చేస్తారు.
ఉదాహరణకు, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 68,000 అయితే, మేకింగ్ ఛార్జీ ప్రస్తుతం గ్రాము బంగారం ధరలో 1% ఉంటుంది. అంటే గ్రాము రూ.680కి సమానం అవుతుంది. మీరు 10 గ్రాముల బంగారు గొలుసును కొనుగోలు చేస్తే, మేకింగ్ ఛార్జీ రూ. 6,800 (10 గ్రాములు X గ్రామ్ బంగారు గొలుసు తయారీకి రూ. 680).
జీఎస్టీ ఎంత ఖర్చవుతుంది?
Akshaya Trithiya 2024: బంగారు ఆభరణాల మొత్తం ధరపై (మేకింగ్ ఛార్జీలతో సహా) GST విధిస్తారు. అంటే, బంగారం ధర ప్లస్ మేకింగ్ చార్జీలు రెండిటినీ కలిపిన తరువాత వచ్చిన మొత్తం ధరపై జీఎస్టీ లెక్కించి ఆ మొత్తానికి కలుపుతారు. ఇది కొనుగోలుదారులు చెల్లించాల్సిన మొత్తం అవుతుంది. ఉదాహరణకు మీరు 10 గ్రాముల గొలుసు కొన్నారని అనుకుందాం.. దాని బంగారం ఖరీదు 68 వేలు అనుకుందాం. దాని మేకింగ్ చార్జీలు 6800 రూపాయలు అవుతుంది. ఇప్పుడు రెండూ కలిపి 74,800 అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తంపై జీఎస్టీ విధిస్తారు.
రత్నాల ఆభరణాలు ఎలా లెక్కిస్తారు?
ఎవరైనా వజ్రాలు లేదా రత్నాలు పొదిగిన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే, ధరను లెక్కించడానికి బంగారం .. వజ్రాలు/రత్నాలను విడివిడిగా తూకం వేయాలి. అయితే, కొంతమంది ఆభరణాలు ఒకేసారి తూకం వేస్తారు, దీనివల్ల వినియోగదారుడు ఆభరణాలను విక్రయించినప్పుడు సరైన ధర లభించదు. ఎందుకంటే బంగారం బరువును తెలుసుకోవడానికి, ఆభరణాల మొత్తం బరువు నుండి రాయి బరువును తీసివేస్తారు.
బంగారం కొనేటప్పుడు ఎప్పుడూ కూడా హాల్ మార్క్ తప్పనిసరిగా చెక్ చేసుకోవాలి. అలాగే, బిల్లు తీసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ప్రతి అంశాన్నీ స్పష్టంగా తెలుసుకుని బంగారం కొనుక్కోవాలి. ఎందుకంటే, డబ్బులు ఎవరికీ ఊరికే రావు కదా.. ఏమంటారు?