ప్రియుడిని చితకబాది ప్రియురాలిపై సామూహిక అత్యాచారం..!

ఒంటరిగా మహిళలు కంటికి కనిపిస్తే చాలు తమలోని కామపిశాచాన్ని బయటికి తీసి కాటేస్తున్నారు. బహిరంగంగానే మృగాళ్లలా వ్యవహరిస్తున్నారు. తాజాగా తమిళనాడులో ఓ ప్రియుడిని చితక బాదిన దుండగులు ప్రియురాలిని బైక్ పై బలవంతంగా ఎత్తుకెళ్ళి.. ఆమె పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇంతటీ ఆగని కామాంధులు ఆ అఘాయిత్యాన్ని వీడియోలా తీసి..ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి వదిలేశారు.

ప్రియుడిని చితకబాది ప్రియురాలిపై సామూహిక అత్యాచారం..!
New Update

ఎంత కఠిన చట్టాలున్నా..కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒంటరిగా మహిళలు కంటికి కనిపిస్తే చాలు తమలోని కామపిశాచాన్ని బయటికి తీసి కాటేస్తున్నారు. బహిరంగంగానే మృగాళ్లలా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ ప్రియుడిని చితక బాదిన దుండగులు ప్రియురాలిని బైక్ పై బలవంతంగా ఎత్తుకెళ్ళి.. ఆమె పై గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. ఇంతటీ ఆగని కామాంధులు ఆ అఘాయిత్యాన్ని వీడియోలా తీసి..ఎవరికైనా చెప్తే చంపేస్తామని బెదిరించి వదిలేశారు.

ఈ దారుణం..తమిళనాడులో చోటుచేసుకుంది. తిరుప్పూర్ జిల్లాకు చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక తన ప్రియుడితో కలిసి కేశవం పాళ్యం రోడ్డు దగ్గర నిలబడి మాట్లాడుతుంది. ఇంతలోకి రెండు బైక్ లపై వచ్చిన ముగ్గురు దుండగులు బాలిక ముందే ఆమె ప్రియుడిని తీవ్రంగా కొట్టారు. తరువాత ఆమెను పోలీసు స్టేషన్ దగ్గర విడిచి పెడతామని అబద్దం చెప్పి బలవంతంగా బైక్ పైకి ఎక్కించుకున్నారు. దగ్గరలోని కాళివేలంబట్టి అడవిలోకి ఆమె తీసుకెళ్లారు. అక్కడ ముగ్గురు దుర్మార్గులు ఆమె పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దాన్ని వీడియో తీశారు. ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దని.. లేకపోతే చంపేస్తామని.. ఆ వీడియోను సోషల్ మీడియాలో పెడతామని బాలికను తీవ్రంగా బెదిరించి తిరిగి పల్లడం కోవై రోడ్డు సమీపంలో విడిచి పెట్టి వెళ్లిపోయారు.

ఇక అక్కడ్నుంచి అతి కష్టం మీద ఇంటికి చేరుకున్న ఆ బాలిక జరిగిన అఘాయిత్యాన్ని తన తల్లిదండ్రులతో చెప్పింది. దీంతో వెంటనే వాళ్లు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులు రమేశ్ కుమార్, జాన్సన్, పార్థిబన్ లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పర్చారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి