Gill – Anderson Sledging: ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి మ్యాచ్ లో గిల్ తో జరిగిన మాటల యుద్ధం పై ఇంగ్లాడ్ పేసర్ జేమ్స్ అండర్సన్ తొలిసారి స్పందించారు. ఇటివలే ముగిసిన ఐదు టెస్టుల సిరీస్లో ఇంగ్లాండ్ను (IND vs ENG) 4-1 తేడాతో టీమ్ఇండియా చిత్తు చేసింది. ధర్మశాల వేదికగా జరిగిన ఆఖరి టేస్ట్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఆటగాళ్ల తో మన భారత యువ ఆటగాళ్లకు మధ్య జరిగిన మాటల యుద్ధం అందరికి గుర్తు ఉండే ఉంటుంది. భారత యువ ఆటగాడు శుభ్మన్ గిల్ (Shubman Gill) – ఇంగ్లిష్ జట్టు సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ (James Anderson) మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. అయితే, అప్పుడు ఏం జరిగిందనేది గిల్ మ్యాచ్ అనంతరం చెప్పలేదు. తాజాగా ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్ అండర్సన్ అప్పుడేం జరిగిందో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
పూర్తిగా చదవండి..Gill-Anderson: గిల్ తో జరిగిన మాటల యుద్ధం పై స్పందించిన జేమ్స్ అండర్సన్
చివరి టెస్ట్ లో గిల్ కు జేమ్స్ కు మధ్య జరిగిన మాటల యుద్ధం పై జేమ్స్ ఓ ఇంటర్వూలో స్పందించాడు. గిల్ నువ్వు భారత వెలుపల నువ్వేమైన పరుగులు చేశావా అని నేను అన్నా? దానికి బదులుగా గిల్ నువ్వు క్రికెట్ కు వీడ్కోలు పలకాలసిన సమయం వచ్చిందని అని అన్నాడని జేమ్స్ తెలిపాడు.
Translate this News: