Ram charan: మైసూర్ లో గేమ్ ఛేంజర్ టీమ్.. కొత్త లుక్ లో రామ్ చరణ్..!

మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ . అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ప్రస్తుతం రామ్ చరణ్ తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్' మైసూరులో షూటింగ్ జరుపుకుంటోంది.

Ram charan: మైసూర్ లో  గేమ్ ఛేంజర్ టీమ్.. కొత్త లుక్ లో రామ్ చరణ్..!
New Update

Ram charan: తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ త్రిల్లర్ సినిమా 'గేమ్ ఛేంజర్'. (Game Changer)  మేకర్స్ 2021 లో RC15 అనే పేరుతో సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మార్చ్ 27 2023 లో రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా అధికారిక టైటిల్ ప్రకటించారు. శ్రీ వెంకటేశ్వర బ్యానర్ పై దిల్ రాజ్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రముఖ నటులు నాజర్, ఎస్. జే సూర్య, జయరామ్ కీలక పాత్రల్లో నటించనున్నారు. ఇప్పటివరకు  సినిమా టైటిల్ తప్ప మరో అప్డేట్ రాకపోవడంతో మెగా ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. మూవీ   అప్డేట్స్ కోసం మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఉన్నారు.

publive-image

గేమ్ ఛేంజర్ టీమ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ కు సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ లో జరిగింది. ఆ తర్వాత కొన్ని రోజులుగా ఆగిపోయిన సినిమా షూటింగ్ ఇటీవలే మొదలైంది. రీసెంట్ గా సినిమా షూటింగ్ కోసం రాంచరణ్ మైసూర్ వెళ్లారు.

అయితే తాజాగా రామ్ చరణ్ మైసూర్ లో చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రస్తుతం గేమ్ ఛేంజర్  మైసూర్ లో గత వారం రోజులుగా మైసూర్ లో షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మూవీ టీంతో కలిసి చాముండేశ్వరి ఆలయాన్ని దర్శించుకున్నారు రాంచరణ్. ఇందులో రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లుక్ లో కనిపించారు.

publive-image

Also Read: Bigg Boss 7: గౌతమ్ ఎలిమినేటెడ్.. కానీ ఓటింగ్ లో బాటమ్ అర్జున్..? షాకిచ్చిన నాగార్జున

publive-image

Also Read: Actor Sameer : “అమర్ ఫౌల్ గేమ్ ఆడాడు.. ఇది కరెక్ట్ కాదు”.. యాక్టర్ సమీర్ షాకింగ్ కామెంట్స్..!

#ram-charan #game-changer-movie
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe