India Announces Global Biofuel Alliance: దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న జి20 శిఖరాగ్ర సమావేశం(G-20 in India) కీలక ప్రకటనకు వేదికగా మారింది. ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో.. ఇప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించిన భారత్.. ఆ దిశగా ఓ కీలక ప్రతిపాదన చేసింది. ప్రపంచ జీవ ఇంధన కూటమిని(Global Biofuels Alliance) ఏర్పాటు చేస్తున్నట్లు G-20 శిఖరాగ్ర సమావేశంలో ప్రకటించింది భారత్. ప్రధాని నరేంద్ర మోదీ ఈ కూటమికి సంబంధించిన కీలక వివరాలను సమావేశంలో ప్రస్తావించారు. జీవ ఇంధనాల అభివృద్ధి, వినియోగం విషయంలో ప్రపంచ దేశాలు కలిసి కట్టుగా పని చేయాల్సిన అవసరం ఉందంటూ జి20 సభ్యలకు దేశాలకు పిలుపునిచ్చారాయన. సరికొత్త జీవ ఇంధనాల అభివృద్ధికి ప్రపంచం ముందుకు రావాలని పిలుపునిచ్చిన మోదీ.. ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా పెట్రోల్లో 20 శాతం ఇథనాల్ కలిపేలా చొరవ తీసుకోవాలన్నారు. జీవ ఇంధనాల విషయంలో అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయడం తక్షణావసరం అని పేర్కొన్న ప్రధాని మోదీ.. ఈ నేపథ్యంలోనే ‘ప్రపంచ జీవ ఇంధన’ కూటమిని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
పూర్తిగా చదవండి..G20 Summit: ప్రపంచ జీవ ఇంధన కూటమిని ప్రకటించిన భారత్
దేశ రాజధాని న్యూఢిల్లీ వేదికగా జరుగుతున్న జి20 శిఖరాగ్ర సమావేశం కీలక ప్రకటనకు వేదికగా మారింది. ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో.. ఇప్పుడు అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రపంచ దేశాలకు సూచించిన భారత్.. ఆ దిశగా ఓ కీలక ప్రతిపాదన చేసింది.
Translate this News: