ఉదయాన్నే ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..!!

ఏపీలో ఉదయాన్నే ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. టాటా మ్యాజిక్ వాహనాన్ని అతివేగంతో దూసుకువచ్చిన కారు ఢీ కొట్టడంతో ఈ ఘోరప్రమాదం జరిగింది.

ఉదయాన్నే ఏపీలో ఘోరరోడ్డు ప్రమాదం..నలుగురు మృతి..!!
New Update

ఆంధ్రప్రదేశ్ లోని అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో ఘోరరోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడిక్కడే మరణించారు. వేగంగా దూసుసుకువచ్చిన కారు టాటా మ్యాజిక్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ఘటన అలమూరు మండలం అలిక్కి జాతీయ రహదారిపై జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా..మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరంతా కొత్తపల్లి మండలంలోని దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ఘటన జరిగింది. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Accident in ap

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe