AP: రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నారు.. టీడీపీ సర్కార్ పై మాజీ ఎమ్మెల్యే ఫైర్..!

రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల నిర్వహణకు సంబంధించి తాము ఉరవకొండలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుంటే.. తనని గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు.

New Update
AP: రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నారు.. టీడీపీ సర్కార్ పై మాజీ ఎమ్మెల్యే ఫైర్..!

Former YCP MLA Visveswara Reddy :  కూటమి అధికారంలోకి వచ్చాక.. రాష్ట్రంలో మారణహోమం సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ జయంతి వేడుకల నిర్వహణకు సంబంధించి తాము ఉరవకొండలో పార్టీ సమావేశం ఏర్పాటు చేసుకుంటే.. తనని గృహ నిర్బంధం చేశారన్నారు.

Also Read: అయ్యో.. గుండెపోటుతో 13 ఏళ్ల బాలుడు మృతి

అనంతపురంలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోలీసుల తీరు పై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉరవకొండలో గత కొన్ని రోజులుగా వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తూ భయోత్పాతం సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సొంత పంచాయతీలో కూడా రైతుల మీద దాడులు చేస్తున్నారని అన్నారు.

Also Read: చంద్రబాబు ముందు సీఎం రేవంత్ పెట్టె డిమాండ్స్.. ఇవే!

దీనిపై త్వరలోనే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని.. జిల్లా ఎస్పీ తగు విధంగా చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నట్టు తెలిపారు. రాత్రి నుంచి పోలీసుల వలయంలో తనను గృహ నిర్బంధం చేశారని మండిపడ్డారు. ఏదేమైనా ఈ ఆందోళనలు ఆపకపోతే.. కచ్చితంగా మా నుంచి కూడా ప్రతి స్పందన ఉంటుందని హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు