పాకిస్తాన్ లో ఆర్థిక సంక్షోభమే కాదు… కొంత కాలంగా రాజకీయ కల్లోలం కూడా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు తర్వాత పీటీఐ పార్టీ నేతల అరెస్టులు, ఆందోళనలు, బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరగడం వంటివి నిత్యం కొనసాగుతూనే ఉన్నాయి. ఇమ్రాన్ ఖాన్పై వందలాది కేసులు పెండింగ్లో ఉన్నాయి. తనను అణచివేసేందుకు ఎన్ని అభియోగాలు మోసినా..అరెస్టు చేసి జైళ్లో పెట్టినా..వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు ఖాయమన్నారు. ఈ క్రమంలోనే ప్రపంచం చరిత్రలో నిలిచిపోయిన దిగ్గజ నేతలతో తనను తాను పోల్చుకున్నారు. అంతర్జాతీయ పత్రిక ది ఇండిపెండెంట్ కు ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..‘నేను గాంధీజీ ఆలోచనలను అనుసరిస్తున్నాను’: పాక్ మాజీ ప్రధాని..!!
శాంతి, అహింస, స్వేచ్చ కోసం పోరాటం చేసిన మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా, జిన్నా లాంటి నిస్వార్థ సేవకులే తనకు స్పూర్తి అంటూ పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు. గాంధీజీ ఆలోచనలను తాను అనుసరిస్తున్నట్లు చెప్పారు. చరిత్రలో నిలిచిపోయిన గాంధీజీ,నెల్సన్ మండేలా వంటి దిగ్గజ నేతలతో తనను తాను పోల్చుకున్నారు. ఓ అంతర్జాతీయ దినపత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఇమ్రాన్ ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
Translate this News: