AP: మా అభిమతం ఇదే.. టీడీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలి: మాజీ ఎమ్మెల్యే

సత్యసాయి జిల్లా కొత్తకోటలో టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య వివాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలకు సర్ది చెప్పారు. ఘటనపై మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్ బుక్ పేరిట టీడీపీ గ్రామాల్లోకి విష సంస్కృతిని తీసుకొచ్చిందని మండిపడ్డారు.

New Update
AP: మా అభిమతం ఇదే.. టీడీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలి: మాజీ ఎమ్మెల్యే

Ananthapuramu: సత్యసాయి జిల్లా బుక్కపట్నం మండలం కొత్తకోటలో టీడీపీ వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి ఇరువర్గాలకు సర్ది చెప్పారు. ఘటనపై మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. రెడ్ బుక్ పేరిట టీడీపీ గ్రామాల్లోకి విష సంస్కృతిని తీసుకొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also read: అందుకే వచ్చిన కంపెనీలు పక్క రాష్ట్రానికి వెళ్లిపోయాయి: ఎమ్మెల్యే

తాము అధికారంలో ఉండగా ప్రజలందరూ ప్రశాంతంగా ఉండాలని కక్షలు, కార్పణ్యాలకు తావివ్వలేదన్నారు. ఎన్నికల వరకే రాజకీయమని ఆ తర్వాత అందరూ సంతోషంగా ఉండాలన్నదే తమ అభిమతమని అన్నారు. అధికారం ఎవరికి శాశ్వతం కాదన్న విషయం టీడీపీ వాళ్ళు గుర్తుంచుకోవాలన్నారు.

Also Read: నోరు పారేసుకోకు.. నెక్ట్స్ జైలుకు వెళ్లేది నువ్వే: ఎమ్మెల్యే సోమిరెడ్డి

వైసీపీ కార్యకర్తలపై భౌతిక దాడులకు పాల్పడడం హేయమైన చర్య అని అన్నారు. వైసీపీకి కూడా మంచి రోజులు వస్తాయని ఇప్పుడు హద్దు మీరి ప్రవర్తిస్తే భవిష్యత్తులో తమ కార్యకర్తలు తమ మాట కూడా వినరేమోనని అన్నారు. ఇటువంటి దాడులు పునరావృతం కాకూడదని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు