Ramakrishna: నిరాహార దీక్ష చేస్తా : మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ

రైతుల సాగునీరు కోసం నిరాహార దీక్ష చేపడతానన్నారు మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. వెంకటగిరి మెట్ట ప్రాంతం రైతు సోదరులకు కండలేరు డ్యామ్ నుండి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు.

New Update
Ramakrishna: నిరాహార దీక్ష చేస్తా : మాజీ ఎమ్మెల్యే రామకృష్ణ

Former MLA Ramakrishna: ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి టీడీపీ (TDP) కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. వైసీపీ (YCP) రాష్ట్ర ప్రభుత్వ పాలన అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ ఆడ్రస్ గా మారిందన్నారు. రౌడీయిజం, లిక్కర్ మాఫియా, గంజాయి మాఫియా, భూదందా అక్రమాలకు పాల్పడుతూ అభివృద్ధిని దూరం చేసిందని ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

Also Read: ఇళ్ల పట్టాల పంపిణీ అడ్డుకోవాలని చూస్తే ఊరుకునేదే లేదు: ఎమ్మెల్యే బాలినేని

వెంకటగిరి మెట్ట ప్రాంతం రైతు సోదరులకు కండలేరు డ్యామ్ నుండి సాగునీరు అందించాలి డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వంలో సాగునీరు అంధక వరి పంటలు ఎండిపోతున్నాయన్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు. ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి రైతులకు సాగునీరు అందించాలి లేని పక్షంలో  కండలేరు డ్యామ్ వద్ద నిరాహార దీక్ష చేపడతారని మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ హెచ్చరించారు.

Advertisment
తాజా కథనాలు