/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-42-1-jpg.webp)
Former MLA passes away: కంటోన్మెంట్ మాజీ ఎమ్మెల్యే బింగి మశ్చేందర్ రావు(94) శుక్రవారం రాత్రి కన్నుమూశారు. అల్వాల్లోని తన నివాసంలో వయోభారంతో ఆయన తుదిశ్వాస విడిచారు. మశ్చేందర్రావు గతంలో జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 1978-83 మధ్య ఆ పార్టీ నుంచి పోటీ చేసి గెలిచారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరి 1983లో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం ఆయన సిండికేట్ బ్యాంక్ డైరెక్టర్గా, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇండియా డైరెక్టర్గా విధులు నిర్వహించారు.