/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/ycp-19-jpg.webp)
Dokka Manikya Varaprasad: వైసీపీకి మరో షాక్ తగిలింది. మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. అధ్యక్ష పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ పెద్దలకు పంపించారు. గత కొంత కాలంగా వైసీపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల వేళ పార్టీకి రిజైన్ చేయడంతో వైసీపీలో తీవ్ర అలజడి నెలకొంది.